Wednesday 17 June 2015



భౌతికంగా దూరమైనా, అయ్యగారి స్మృతులతో మమేకమై నిలచిపోయిన రామావఝల శ్రీశైలంగారికి అశృనివాళి యెలా సమర్పించాలో అర్థం కావటం లేదు.  అయ్యగారి గ్రంధాల ప్రసక్తి యెక్కడ వచ్చినా, ఒక కొత్త విషయాన్ని ప్రస్తావించి మమ్మల్ని ఆశ్చర్యచకితులను   చేసేవారాయన! వారి నిత్య నూతన ఆసక్తి అబ్బురపరచేది. తనగురించి, తన రచనల గురించి అస్సలు ప్రస్తావించేవారు కాదు. యెదైనా  మేమే చూసి మీ వ్యాసం బాగుంది శ్రీశైలంగారూ అంటె,  ఆ..యేదోలెండి..అని తేల్చేసేవారు.   యెమ్మెస్ సుబ్బులక్ష్మిగారి గురించి వారి స్మృత్యంకంలో కవిత రాశారు. అందమైన దస్తూరీ గురించి చక్కటి వ్యాసం వ్రాశారు.ఇంక చాలానే వ్రాసి ఉంటారు. చాల లోతైన మనిషి వారు.  అటు సాహిత్యము, ఇటు భక్తి, అటు వైజ్ఞానిక రంగం,  ఇటు సంప్రదాయ వాదం- అన్నిటినీ సమానంగా గ్రొలటమే కాక, ఆయా విషయాల గురించిన బోలెడు సమాచారం అంగ్లంలోనైన, తెలుగులోనైన తీసి పదిల పరచటం వారి  అపురూపమైన అలవాటు. అత్యంత ప్రీతి దాయకమైన అలవాటు. వారి  కుటుంబ సభ్య్లెవరూ వారి అభిరుచికి అడ్డు చెప్పిన దాఖలాలే లేవు ఇప్పటివరకూ! పైగా సహకరించటమే యెక్కువ. ఇటీవల మా  అయ్యగారి సాహిత్య సర్వస్వ  ప్రచురణ సమయంలో, వారి అబ్బయి శ్రీ సాయి కృష్ణ రాత్రనక, పగలనకా, వారి నాన్నగారు నాకు  అందివ్వమన్న సమాచారాన్ని వెంటవెంటనే అందివ్వటం చూస్తే వీరి ఋణం తీర్చుకోవటం బహు కష్టం అనిపించేది. అయ్య గారి  పట్ల శ్రీశైలంగారికున్న అభిమానం,వారి కుటుంబ సభ్యులందరిదీ అవటం మనసుకెంతో ఆనందాన్ని కలుగ జేసేది. ఇవన్నీ నిన్నటి మాటలైపోవటమే విచారకరమైన విషయం. శ్రీశైలం గరి వద్ద ఫైళ్ళలో ఉన్న అత్యంత విలువైన సమచారాలన్నీటినీ  వెలుగులోకి తెచ్చే బృహత్తర కార్యాన్ని వారి  కుటుంబ సభ్యులు చెపడితే,  శ్రీశైలంగారి కృషికి  సార్థకత చేకూరుతుందనిపిస్తూంది. ఇప్పుడిక  యీ  దుఖ సాగరంలొ యీదటం అలవాటైన తరువాతైనా, యీ ఫనిని చేపట్టవలసినదిగా వారి  తనయులకు వినమ్ర విజ్ఞప్తి.  

No comments:

Post a Comment