Monday 7 March 2016


 'ఉత్తరాది మఠ స్వాములు సత్య ధ్యానతీర్థులుండిరి. వారు ద్వైతులు. దానశూరులు. వారికదిశంకరుల గ్రంధములు కొట్టిన పిండి. వాదములలో శాంకర గ్రంధములలో పరస్పర వైరుధ్యములు చూపెడివారు. పూర్వపక్షమునకేయవకాశమివ్వరు. వీరుజూపించు విరోధములనెత్తిపోసుకొనుటలొనే  ప్రతివాదులకు, సరిపోవును. ఇదియొక మహాప్రతిభ. కళాశాలాధ్యక్షులు సుబ్బరావుగారుండిరి. అదియొక జ్ఞానప్రధానావతారము.  వారేశాస్త్రములో పూర్వపక్షము జేసిననూ, సమాధానము వారుజెప్పవలసినదే! అట్టి వాద సభలు కాళిదసన్నట్టు, 'కాంతుం క్రతుం చాక్షుషం..' .అంతే !
   (త్వరలో రాబోతున్న పుట్టపర్తి  విమర్శతరంగిణి(రెండవభాగము) నుండీ! (ప్రతులు  కావలసిన మిత్ర బృందము వివరములకొరకై నాకు   సందేశమివ్వగలరు)



No comments:

Post a Comment