Wednesday, 27 April 2016

Frends dears..
These r the details of 2 day PUTTAPARTHI SAHITI SAMARCHANAM, planned and arranged by me, thru the association I formated in 1996. The plan actually was to honour a literary legend with a heavy purse of 25k (probably maa ayyagaru himself might  not have received that worth purse I remember). But due to my domestic and personal reasons, I shifted to the mission of printing maa ayyagaru's books instead. So I think thru that activity,  I have succeeded in preserving and presenting the very valuable writings of maa ayyagaru to the literary world. Now as per my thinking, nearly 90% of maa ayyagaru's literature is made available to his LITERARY LOVERS, I thought to organise a two day SAHITI SAMARCANAM of maa ayyagaru, (GADYA PADYA SAHITYAM of Puttaparthi varu)  with descriptive lectures by stallwarts in those fields.
   Frends dears...Here r the details of the 2 day meet. Pl treat this as my HRIDAYA POORVAKA AHVANAM...




  SAHITI MITRULAKU SADARA AHVANAM...

Tuesday, 26 April 2016

Frends dears.......Pl.check out  here tomorrow too  for more details (More information about the function  .......)

Sunday, 27 March 2016

                          అయ్యా! మీకు జన్మదిన శుభాకాంక్షలు...
             మళ్ళీ మళ్ళీ ...
             మీ కడుపునే పుట్టేలా ఆశీర్వదించండి !
             మా ఆచార్యులు మీరే! 

              ఆరాధ్యులూ  మీరే !  
              ఇప్పటికీ ! యెప్పటికీ !
                                                 (28-3-1914 )

Saturday, 19 March 2016

Dr KV Ramana Chary ,IAS Retd Advisor to Govt Released Book Of Dr Puttapa...



Part 2 of the book releasing function of maa ayyagaru Dr.Puttaparthi Narayanacharya on 14th March 2016 at Telangana bhavan in the august presence of Dr.K.V.Ramanacharya, Cultural advisor to the Govt. of Telangana




Book Release of VIMARSA Tarangini of Dr.Puttaparthi.by Dr.K.V.Ramanachar...



Part I  of the book releasing function of maa ayyagaru's VIMARSA TARANGINI in Telangana Bhavan, on 14th March 2014 in the august presence of Dr.K.V.Ramanacharya, advisor to the Govt. of Telangana.






 

Tuesday, 15 March 2016


Frends dears...
I am very much excited with this joy of released CRITISISM books (2parts) of my revered  father Dr.Puttaparthi. My dream of 25 years is now fulfilled by this edition of my father's works.
I will be more happy if my father's fans, read them and share their views. They may be available at NAVODAYA and TELUGU BOOK HOUSE, both at Arya samaj Road, Kachiguda cross Roads, Hyderabad.
 

Tuesday, 8 March 2016


త్వరలో రాబోతున్న 'పుట్టపర్తి విమర్శతరంగిణి' -రెండవభాగము

........................

          ప్రస్తుతము ప్రకటించిన 'ఋతుఘోష' రెండు కావ్యముల సంకలనము. ఋతువర్ణనము ప్రధానంగా నడుస్తుంది. ఒక ప్రియాప్రియుల ప్రేమగాధ అంగంగా సాక్షాత్కరిస్తుంది. ఈ సంకలనమెందుకని కవిగారినే ప్రశ్నించినాను. ఋతువర్ణనమొక్కటే ఐతే చదవడానికి బాగుండదేమోనని ఈ పని చేసినామన్నారు. చేర్చకుండా వుంటే బాగుండేదని నా ఊహ....
.............
         శర్మగారిలో విశ్వనాధ, జాషువా, రాయప్రోలు, కృష్ణాశాస్త్రి మొదలగువారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయి. శర్మగారికి తెనాలి రామకృష్ణుడన్నా పక్షపాతమే ! కొన్ని చోట్ల ఈ కవి, నేరుగా ఉమర్ఖయ్యాముకు శిష్యుడై కనిపిస్తాడు. వర్షఋతువును వర్ణిస్తూ, 'ఆత్మవేదనకొక యాకారమై తోచి నేటి రేయి నన్ను కాటు వేసె' అంటాడు. ఇట్టి పోకడలనే, 'సబ్జెక్టివ్ పొయెట్రీ ' అంటారు మర్మవిదులు.

...........


 

              'ఆరుద్ర' కు నియమోల్లంఘనం చేయడమే స్వభావమని చెప్పినాను. కనుక యీ రచనలో, బాల వ్యాకరణాన్నీ, పాణినీయాన్నీ వెదకడం కష్టం. కవిత్వమనే పదార్థం ఇంతకు మించినది అనే దృష్టిని పట్టుకుంటే, యీ కావ్యం చదువవచ్చు.
  జయంగొండార్ కవి తమిళంలో చాలా ప్రసిద్ధుడు. లలితుడుకూడా !
పరణి అని వీరకావ్యానికి పేరు. యెటువంటి వీరకావ్యం అనే విషయంలో ఒకటి రెండు వ్యాఖ్యాన భేదాలు లేకపోలేదు. కవి మొదటి కుళోత్తుంగుని ఆస్థానంలో వుండినాడు. మదటి కుళోత్తుంగుడు, మన రాజరాజనరేంద్రుని కుమారుడే ! చోళ చాళుక్యులకు చాలా సంబంధ బాంధవ్యాలుండేవి.
      తమిళంలోకి మనం ప్రవేశించినప్పుడు, కొన్ని కొన్ని కొత్త సంకేతాలూ, అలంకారాలూ, ఆచారాలూ- మన కంట పడతాయి. తమిళ వాంగ్మయమే సంస్కృతంతో సంబంధంలేని ఒక మహా ప్రపంచం. ఉడుక వాద్యంతో నడుమును పోల్చడం, పగడసారెలతో స్తనమండలాన్ని పోల్చడమూ అంతే !
................
         శేషేన్ గారి 'ౠతుఘోష' కు పుట్టపర్తి 18-2-63 నాటి విపుల పీఠికా, ఆరుద్ర గారి తమిళానువాదం 'వేసవి- వెన్నెల' పై పుట్టపర్తి వారి చెణుకులూ ('63)..మరింకా యెన్నేన్నో. పుట్టపర్తి వివిధ భాషా సాహితీవిన్నాణానికి అద్దంపడుతూ..'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం' లో మీముందుకు రాబోతున్నాయి....

........................






పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : ఏకవీర నవల కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి

పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : ఏకవీర నవల కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి: శ్రీరంగాచార్యులు గారు పుట్టపర్తి గురించి చెప్పిన విశేషాలు.. పుట్టపర్తి ఏకవీర నవలలు కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి అనువదించారట.. ఈ రికా...

'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం'




 

నాకాంగ్లముపై ద్వేషము లేదు. అది మనదేశమునకెంతయో ఉపకారము చేసినది. ఇంగ్లీషును తిట్టు పండితులను చూసిన నాకసహ్యమే ! ఒక ఇంగ్లీషేమి? ప్రతిభాషకూడ యెంతో యుపకారమొనర్చును. ఆంగ్లేయులుకూడ మనభాషకు తక్కువ సేవచేసినవారు కాదు. దక్షిణభాషలకు మొదటి నిఘంటువును వ్రాసినవారందరునాంగ్లేయులే ! బ్రౌనుదొర మనభాషకుచేసిన సేవ సామాన్యమైనదికాదు. అదియాతనికి తండ్రినుండి సంక్రమించిన యాస్తి. అతడు వంగాదిభాషలకెంతయో సేవచేసినవాడు. ఆంగ్లేయులు సంస్కృతమునకు చేసిన సేవ మనము సిగ్గుపడవలసినంతటిది.'

ఆంగ్లేయ పండితుల గురించీ, బ్రౌను దొర గురించి పుట్టపర్తి తన అభిప్రాయాలను ఇంత కుండబద్దలు కొట్టేలా వెలువరించిన సందర్భమేది? త్వరలో మీముందుండబోతున్న 'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం'లో యీ వాస్తవాలు మీముందుకు రాబోతున్నాయి... .





Monday, 7 March 2016


 'ఉత్తరాది మఠ స్వాములు సత్య ధ్యానతీర్థులుండిరి. వారు ద్వైతులు. దానశూరులు. వారికదిశంకరుల గ్రంధములు కొట్టిన పిండి. వాదములలో శాంకర గ్రంధములలో పరస్పర వైరుధ్యములు చూపెడివారు. పూర్వపక్షమునకేయవకాశమివ్వరు. వీరుజూపించు విరోధములనెత్తిపోసుకొనుటలొనే  ప్రతివాదులకు, సరిపోవును. ఇదియొక మహాప్రతిభ. కళాశాలాధ్యక్షులు సుబ్బరావుగారుండిరి. అదియొక జ్ఞానప్రధానావతారము.  వారేశాస్త్రములో పూర్వపక్షము జేసిననూ, సమాధానము వారుజెప్పవలసినదే! అట్టి వాద సభలు కాళిదసన్నట్టు, 'కాంతుం క్రతుం చాక్షుషం..' .అంతే !
   (త్వరలో రాబోతున్న పుట్టపర్తి  విమర్శతరంగిణి(రెండవభాగము) నుండీ! (ప్రతులు  కావలసిన మిత్ర బృందము వివరములకొరకై నాకు   సందేశమివ్వగలరు)



Thursday, 3 March 2016




Ayya remembered on the eve of SIVARATRI in Today's (4th March 2016)Andhra Jyothi (Nivedana Page)

Tuesday, 23 February 2016



అయ్య పేరుతో  'శివతాండవం'  ముడివడిపోయి ఇప్పటికి  అరవైయేళ్ళు దాటిపోయింది. 1955నాటి ద్వితీయ ముద్రణ గుంటూరు ఆంధ్ర సంసత్ వాళ్ళు చేసినది. అప్పటికి,  నలభై పదుల వయసున్న నారాయణుని ముందు మాటలొ తొణికిసలాడుతున్న వినయ సంపదకు ముగ్ధులవని వారుంటారా, అనిపించింది నాకైతే! యీ పోష్ట్ లో, దీనితోపాటూ, అయ్య యే విషయం గురించైనా  వ్రాసుకునే నోట్స్ స్వదస్తూరిలో ఉన్నది  పొందుపరచాను. జాగ్రత్తగా చూడండి.  చిన్న చిన్న అక్షరాలలో, యెంతో శ్రద్ధగా,తనకు మరీ ముఖ్యంగా తోచిన విషయాలను, రేఖాంకితం చేసుకోవటం-  ఇవన్నీ, యెంతో  యేకాగ్రతతో చెసుకునేవారాయన యెప్పుడూ - రాత్రీ పగలూ తేడాల్లేకుండా!  మిద్దె మీద ఉన్నంతసేపూ, సాహితీ గహనవనాల్లో,  అలసటెరుగక  విహరించిన ఆ కవికిశోరం -  మిద్దె దిగి కిందికి, యీ వాస్తవ ప్రపంచంలొకి వస్తే, యెంత తేడా తెలుస్తుండేదో కదా!  అయ్య మాటల్లోనే....  'యెంతసేపూ,  పప్పూ, వుప్పూ, చింతపండూ సంపాదనలోనే  తనకలాడి, యేదో అలిసిపోయినట్టు, గుర్రుపెట్టేవాళ్ళకేంతెలుస్తుంది, యెంత శ్రమ పడితే, పాండిత్యం  ఒంటపడుతుందో!" ఇంతకూ, శివతాండవం శిఋషిక కిందున్న ఆంగ్ల కొటేషన్ గమనించండి. జీవిత రహస్యం యేమిటంటే, పెద్ద ఆశయాలను సాధించే క్రమంలో, చిన్న చిన్న అకర్షణలను త్యగం చేయవలసు ఉంటుందని...నాకైతే, ఇదేవిధంగా  అర్థమైంది...మీరూ  ఆలోచించండి - మీకేవైనా కొత్త అర్థాలు తడుతాయేమో!























 

Monday, 15 February 2016



రాసీమ రత్నం- బెళ్ళూరి

అయ్య బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారిని చాలా  ఇష్టపడేవారు. చిన్న తనంలో వారిని బాగా దగ్గరగా చూసినట్టే గుర్తు. వారు, మా తాతగారు  శ్రీమాన్ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారికి శిష్యుడుకూడా కావటంవల్ల, వాళ్ళిద్దరి మధ్యా స్నేహ బంధమలా పెనవేసుకుందేమో!   వారి రచనల బైండింగ్ ఒకటి  నాకు శ్రీమాన్ రావినూతల శ్రీరాములుగారి ద్వారా యెప్పుడో అందింది.  తపోవనము (1954)  తో పాటూ ఇందులో,   కావ్యగంగ (1957) అన్న దనిలోని కొన్ని రసగుళికలు, మీకోసం! ఇందులో  వున్నవి.. గురు ప్రశంస పేరిట, మా తాతగారిగురించిన పద్యాలు, అయ్యకు అనంతపురంలో వీడ్కోలు సందర్భంగా వారు  చదివిన పద్యలూ, రాయలసీమ గురించి వారి రసరమ్య భావనలూ...వీటిని ఆస్వాదించండి!  ఇంకా యీ సంకలనం ఆకర్షణను  అద్భుత చిత్రాలు (చిత్రకారునిపేరు  నా కంటికి  కనబడలేదు మరి) అదనం....





















Saturday, 13 February 2016

Alarulu kuriyaga adenade.....by Tallapaka Annamacarya







ఈ రోజు ప్రేమ దినోత్సవం. నిన్నటి నా పుస్తక శోధనలో బయటపడిన 12,మే 1982 నాటి ఆంధ్ర ప్రభ ప్రత్యేక సంచిక (వారపత్రిక) లో చిన తిరుమలయ్య వ్రాసిన శృంగార మంజరిలొని యీ ముచ్చటగొలిపే వివరణ చూడండి.






గాలిపటాలలో, కస్తూరిలో అద్దిన లేఖినితో ప్రేమలెఖ వ్రాసిన ఆ నాయకి వర్ణన యెంత మనోజ్ఞం!
యేమొకో చిగురుటధరమున.....ఇదీ అంతే!
 రుక్మిణీదేవి కూడా, శ్రీకృష్ణుని వలచి ప్రేమలెఖ పంపింది కదా మరి!
అన్నమయ్య అలమేలు మంగ, తన పతి మనసు గెలుచుకునేందుకు, అరతెర మరుగున నుంచీ నాట్యం చేసిందని అన్నమయ్య అంటాడు అలరులుగురియగ ఆడెనదే..అన్న పదంలో!
 అప్పటి రోజుల్లో, వీధినాటకలలోనో మరెక్కడో,(అప్పటికి భామాకలాపం వుండేదా?)
 తెరమరుగు నుండీ నాయిక పాత్ర ప్రవేశించే విధానం అన్నమయ్య రచనలో ప్రతిబింబించిందని అయ్య చెప్పినట్టు గుర్తు - నాచేత శ్రీ రామకృష్ణాహైస్కూల్ లో యీ పాటకు నాట్యం చేయించినప్పుడు!
మా తులజక్కయ్య, బాలసరస్వతిగారి నాట్యాభినయ గ్రంధాన్ని దగ్గర పెట్టుకుని, ముద్రలూ అవీ అయ్య సూచనల ప్రకారం నాకు నేర్పించింది.
   'కందువ తిరువెంకతపతి మెచ్చగా అన్న చోట, దశావతారాలూ యివిధంగా అభినయించమని చెప్పి చెసి చూపించారు అయ్య స్వయంగా! .
ఇక ప్రదర్శన తరువాత, మ అయ్య నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నరు - మురిపెంగా! అమ్మ ఇంట్లో దిష్టి తీసింది! 
 అయ్యో..కేవలం స్మృతి పటలంపై మాత్రమే రికార్డ్ చేసుకోగలిగానే, అని ఇప్పుడు యెంత ఆవేదనో!
 అప్పటి ఫోటొలు కూడా యేవీ లేకపోవటం - యెంతటి తప్పిదం కదా! (ఆ పాట ఇప్పటి నా గానంలో _ శంకరాభరణ రాగం)




 ............................
అలరులు కురియగ నాడెనదే |
అలుకల గులుకుల అలమేలు మంగ || అరవిరి సొబగుల నతివలు మెచ్చగ | అరతెర మరగున నాడెనదే |వరుస పూర్వదువాళపు తిరుపుల | హరిగరగింపుచు అలమేలు మంగ ||మట్టపు మలపుల మట్టెల కెలపుల | తట్టెడి నడపుల దాటెనదే |పెట్టిన వజ్రపు పెణ్డెపు తళుకులు | అట్టిట్టు చిమ్ముచు అలమేలు మంగ ||
చిందుల పాటల సిరి పొలయాటల | అందెల మోతల నాడెనదే |కందువ తిరువేఘ్కటపతి మెచ్చగ |అందపు తిరుపుల అలమేలు మంగ ||....
.............................




Friday, 12 February 2016

Veena vadini varde! var de! (Nirala)






                     మా అయ్యగారికి హిందీ కవులలో నిరాలా అంటే యెందుకో చాలా ఇష్టంగా వుండేది. ఒకనొక ఇంటర్వ్యూ లో వారన్నారు..'నాకూ, నిరాలాకూ చాలా పోలికలున్నందువల్లేనేమో, అతనంటే, నాకు మహా ఇష్టం. అతనూ నావలెనే చాలా కష్టపడినాడు జీవితంలో. ధనాభావంతో, నిష్టుర దారిద్ర్యంతో చివరి రోజుల్లో, ఆయన బిడ్డకు జబ్బు చేస్తే పాపం సరైన వైద్యమూ చేయించలేక పోయినాడు. ప్రపంచంలో దారిద్ర్యంకంటే మించిన పాపం లేదేమోననిపిస్తుంది. ఇప్పుడు ఆయన రచనలకు నీరాజనాలర్పిస్తున్నారు.' (నేను 2002 లో ప్రచురించిన 'సరస్వతీపుత్రునితో సంభాషణలు' పేజీ 38)


       నిరాలా వ్రాసిన 'రాం కీ శక్తి పూజా'  మాకు ఎం. ఏ. లో వుండేది. యెన్నిసార్లు చదివి వుంటానో లెక్కలేదా రచనను! ఆధ్యాత్మ రామాయణ ప్రభావం బాగా కనిపిస్తుందందులో!







 (అరుణ్ రామాయణ్ అన్న అరుణ్ పోద్దార్ హిందీ రామాయణం చదివినప్పుడూ నేనిలాగే యెంతో వుద్వేగానికి గురైనాను. నేను సౌందర్య లహరి బాగా పారాయణం చేసేదాన్నప్పట్లొ. మొదటిరొజు మొదటి శ్లోకం 108 సార్లు చేసి, తక్కిన శ్లొకాలన్నీ చదివేయటం. రెండొ రోజు రెండవ శ్లొకం 108 సార్లు. మూడో రోజు మూడవ శ్లోకం- అలా, నూటా యెనిమిది శ్లోకాలూ, 108 రోజుల్లో పారాయణం చేయమని అమ్మ ఇచ్చిన సలహాను నేను అలా దీక్షగా చేస్తుంటే అయ్య కూడా యెంతో ఇష్టంగా గమనించేవారు కూడా! అప్పుడు అమ్మా, అయ్యా యేంచెబితే అవి చేయటమే, జీవిత లక్ష్యాలు అప్పట్లో! .) 
       నిరాలా వ్రాసిన యీ సరస్వతీ వందన పాడాలని యెన్ని రోజులుగానో అనుకుంటున్నాను. రేపు మాఘ పంచమి. సరస్వతిదేవి మా నాయనమ్మ. ఆమెకు ప్రణమిల్లుతూ రికార్డ్ చేశాను మరి! (అభేరి రాగ చాయలతో) మా అయ్య ఇంకా వాళ్ళమ్మ దగ్గరే కూర్చుని, తన కావ్యగానం చేస్తూనే వున్నారో, లేదూ, అమ్మ ఆశీర్వాదంతో, యెక్కడైన అవతరించి వుంటారో, తెలియదు. యీ నా జన్మకు యీ కృప చాలునంటారేమో మరి!
......................  

Wednesday, 10 February 2016

Jalaja Nayana... A sweet Sanskrit Mangala Harathi





                      ఆనంద భైరవి
......................
ఈనాడు మనకందరికీ  మైసూర్ గా చిర పరిచితమైన ఆ నగరాన్ని, ఇదివరకు, అంటే పాత కాలంలో యేమని పిలిచేవారో తెలుసా? మహీశూర పురం! యెంత బాగుంది కదా! ఆ మహీశూర పురంలోనే శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన ప్రాచీనమైన పరకాల మఠం వుంది.(నేను మైసూరుకు ఉద్యోగంలో వున్నప్పుడు రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళి, ఆ పూర్వ వైభవాన్ని దర్శించి,  ధన్యురాలై వచ్చాను)  మరి ఇప్పుడా ప్రసక్తి యెందుకంటే, ఆనంద భైరవి రాగం లోని యీ మంగళహారతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ బ్రహ్మ తంత్ర పరకాల మహాదేశికుల వారు  (వీరు పరకాలమఠ యేకత్రింశనాం స్వామివారు-31వ పీఠాధిపతి) తన పూర్వాశ్రమంలో రచించినది. నా చిన్నప్పుడు, యీ మంగళహారతిని, మా అమ్మ, శ్రీమతి కనకమ్మా, మా అక్కయ్యలు కరుణ, తరులతల యుగళగళాలలో యెన్నో సార్లు విన్న అందమైన  జ్ఞాపకం యీనాడీవిధంగా మీముందుకు తీసుకువస్తున్న సంతోషం! నోరు తిరిగేందుకు, గాదె కింద కంది పప్పు...ఇంకా... నల్ల లారి మీద యెర్ర లారీ...ఇలాంటి ప్రయోగాలేమంటారొ మరిచిపోయానిప్పుడు కానీ యీ పాటలోని పదాలను క్షుణ్ణంగా,  తప్పులు లేకుండా పలకడం అంత  సులువేంకాదు సుమా! ఒక సారి ట్రై  చేయండి మీకే తెలుస్తుంది! సంస్కృత రచనే ఐనా, ద్రాక్షాపాకమండీ! యెంత మధుర పదజాలం! యెంత చక్కటి భావం! ముందు రచన చూడండి. తరువాతే పాట వినండి  దయచేసి.....(   'కల్యాణ గీత మంజరి'   పేరుతో 1966లొ ముద్రితమైన యీ చిన్ని పొత్తాన్ని, పుట్టింటి ఆస్తిగా వెంట తెచ్చుకున్నాను - యెప్పుడో.! .యేమిటో..నా  పిచ్చి నాకు ఆనందం!)
........................
 జలజ  నయన  తవసు మంగళం
   భుజగ శిఖరి,   కలిత నిలయ  భవతు మంగళం....
   జలధి  శయన  విబుధ   వినుత  లలిత  లలిత  చరిత  భరిత
   వలభి  దుపల  పటల  రుచిర  చలిత  లులిత  చికుర  నిటిల...
                     .జలజ  నయన  తవసు మంగళం
                      భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం...
శరణ  వరుణ  కుతుకి దేవతా
     భరణ రుచిత.. కరుణ నిగమ  సుగమ  దైవతా..
     అరుణ తరుణ  తరుణి  కిరణ
    చరణ  చరణ హరిణ  హరణ 
    హరిణ  కిరణ  వదన  జనన
   సరణి  తరణ  కరణ  శరణ...
             .జలజ  నయన  తవసు మంగళం
             భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం.....
 సురత  మృదిత  జలధితాస్తనా..
     భరత సహజ
    హరిత  తురగ  తనుజ  పాలనా..
   స్ఫురద  విరత సతత కఠిన
    విరుత భువన కదన జనన
    దురిత భరిత  చరిత  సదన
    నిఋతి  వితతి విరతి లకన 
                          .జలజ  నయన  తవసు మంగళం
                           భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం..
 పవన  తనయ  వినుతి  భాజనా 
      పవన  హరణ 
      నవన  వచన  నివహ  పావనా..
     పవన  లవన  యవన  గహన 
     జవన  వలన  వహన  పవన 
     నవ  సుదుర్గ  భవన  కృష్ణ 
     కవన  సరణి  జవన  చరిత...
                      .జలజ  నయన  తవసు మంగళం
                      భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం..
.

Saturday, 6 February 2016

Kadaku migiledi.....Dr.Puttaparthi's Devotional (non-denominational) song








7-2-16
................

అయ్యకూ, అయ్య అభిమనులకూ- అందరికీ యెంతో ఇష్టమైన భక్తిగీతమిది. ఒక విధంగా, జీవిత సారాన్నంతా, మూడు చరణాల్లో విశదపరచే యీ భక్తి గీతం-1970లలో, ఆకాశవాణి హైదరాబాద్ వారి కోరికపై అయ్య రాశారు. శ్రీ పాలగుమ్మి విశ్వనాధం గారి సంగీత నిర్వహణలో, హైదరబాద్ సోదరీమణులుగా విఖ్యాతులైన శ్రీమతి లలిత, హరిప్రియ గారలు గానం చేశారు. యెంతో అర్థవంతమైన యీ పాట, రికార్డింగ్ ను సరైన రీతిలో, భద్రపరచలేకపోయినందుకు, వ్యక్తిగతంగానూ, ఆకాశవాణి ఉద్యోగినిగానూ, యెంతో బాధపదుతున్నా, నాకు వచ్చినరీతిలో, ఇలా మీముందుంచగలుగుతున్నందుకు లేశమాత్రం సంతోషంగా ఉంది. ఇదిగో సాహిత్యం-మీకొసం.....

కడకు మిగిలేది ఇది ఒకటే,

యెడద జపించిన భగవన్నామము..కడకు...

అష్టైశ్వర్యములమరినగానీ,

ఆచారమ్ములు నెరపిన గానీ,

అఖిల శాస్త్రములు చదివిన గానీ,

ఆహా! యను యశమమరినగానీ...కడకు...

హఠయోగమ్ములు బట్టినగానీ,

ఆశ్చర్యంబులు చూపినగానీ,

అతివలకన్నుల క్రీనీడలలో,

ఆత్మార్పణములు చేసినగానీ...కడకు..

ఆకాశంబులు గొలిచినగానీ,

అబ్ధి జలము శోధించినగానీ,

చంద్రలొకమునకేగినగానీ,

సకలజగముతానేలినగానీ..కడకు...