Wednesday, 23 December 2015


శ్రీ అరవిందులవారి రాష్ట్ర స్థాయి సమావేశాలలో మా అయ్యగారిపై శ్రీ అరవిందులవారి ప్రభావం గురించి కొన్ని అనుభూతులను పంచుకునేనుదుకు డిసెంబర్ 19,20 తేదీలలో చిత్తూరుకు వెళ్ళిరావటం జరిగింది. అక్కడ నేను పాల్గొన్నప్పటి చాయాచిత్రాల్లివి. చాల విశేషాలు చెప్పాలని ఉంది. రెండు రోజుల్లో అక్కడి మరిన్ని విశేషాలు వివరంగా వ్రాస్తాను. అరవిందులవారి దర్శనం అయ్య తరచుగా చేసుకున్నా, అక్కడ శ్రీ అరవిందులవారితో వారి అనుభవలను యెంత ప్రయత్నించినా సేకరించలేక పోవటం- యెంతో నిరాశను కలిగించినా, అయ్య దగ్గర అరవిందులవారి 'ఊర్వశి' చదివిన జ్ఞాపకాలు మధురమైనవి. పదాల పోహళింపూ, భావ గాంభీర్యతా- అనితర సాధ్యాలే కాక, అనుసరణకందనివి కూడా! అయ్యగారి భావజాలంలో అరవిందులవారి ప్రసక్తి సిద్ధాంతపరంగా, యెంతో సంక్లిష్టమైనదీ, సామాజిక ఆధ్యాత్మిక పరిశోధనతో కూడుకున్నది కూడా! అన్నట్టు, అక్కడ, మా అయ్యగారు, 1960లో వ్రాసిన విప్లవ యోగీశ్వరుడు, అన్న చిన్ని పొత్తము (ధర అమూల్యం) నా చేతులమీదుగా పునరావిష్కరింపబడటం- నా మహద్భాగ్యమే! ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులవారు యీ పుస్తక పునర్ముద్రణ చేయమని కార్యనిర్వాహకులకు, సూచించటం-ఆ విద్యాఖని   ఆదేశం అక్కడ పాటించటమూ- గొప్ప విషయం. అయ్య సంతానంలో ఒకదానిగా జన్మించటం- యెంత గొప్ప భాగ్యమో అవగతమౌతూ ఉంటుందిలాంటి సన్నివేశాలలో! చిత్తూరు వాసులే కాక, రాష్ట్రం లోని అనేక శ్రీ అరవింద సంస్థలనుండీ ప్రతినిధులెందరో పాల్గొన్నారక్కడ! దాదాపు, అందరికీ అయ్యతో యేదో ఒక జ్ఞాపకమూ, దాన్ని పదిలంగా గుర్తు పెట్టుకుని, నన్ను చూసిన వెంటనే వాళ్ళా సంగతి ప్రస్తావించటం చూస్తుంటే, అయ్య నిజంగా ప్రజాకవి అనే అనిపించిందండీ!
ఆచార్య కోవెలవారితో అయ్యగురించి, యెన్నో విషయాలు మాట్లాడుకోవటం  ఆనందాన్నిచ్చింది. వారు నన్నొక విషయమై దదాపు ఆజ్ఞాపించరనే అనవచ్చు. అదెమిటో త్వరలో చెబుతాగా!
ఇప్పటికీ ఫోటోలు చూడండి. ఫేస్ బుక్ స్నెహితులందరూ, పుస్తక ప్రదర్శన సందర్శనంలో చాలా బిజీగా ఉన్నారుకదామరి-మీ సమయం యెక్కువ తీసుకోకూడదనీ!  
ఇవిగో, యీ చాయాచిత్రాలు చూడండి, వీటి వివరణ త్వరలో!










Tuesday, 15 December 2015

   అరబిందో మహర్షి గురించి మా అయ్యగారు  విప్లవయోగీశ్వరుడు అని


ఒక చిన్న పొత్తము, 1960 లో వ్రాశారు. అరవిందులవారి అవతరణ-


 రామకృష్ణ పరమహంస మహాసమాధి- ఆగష్ట్ 15 నే కావటం 


 ఘుణాక్షర న్యాయం వంటిదని కొందరంటారు కానీ, భారతదేశ స్వాతంత్ర


 సిద్ధి కూడా అదెరోజు కావటంలో యెదొ పెద్ద సందేశమే ఉందని వారి భావన.
 
డ్రూయట్  దంపతుల వద్ద తానున్న సమయంలో షేక్స్ పియర్ రచనలను


 తెగ చదివేవారట అరవిందులవారు! టెన్నీసన్,  వర్డ్స్ వర్త్ షెల్లీ,


కీట్స్..వీళ్ళందరి హృదయాలనూ వారు ఆపోసన పట్టేశారట!


అరవిందులవారి జీవిత సంగ్రహం వ్రాస్తూనే,  తనవైన వ్యాఖ్యలను
 
కూడా అక్కడక్కడా ఆనాడే వినిపించేవారు-పుట్టపర్తి వారు.



        'దేశభాషలెంత గొప్పవైననూ, భారతీయాత్మను సంపూర్ణముగా



వెల్లడింపలేవు. '
        'సాహిత్యము,  హృదయమును సంస్కరించుచూ, భావములు



విశాలమొనర్చును. కానీ,  సాధన, మర్గములనుపదేశించును.'

        'ఒక దేశము యొక్క విజ్ఞానము,  వికాసమొందవలెనన్నచో,  నా దేశము



 స్వతంత్రముగానుండవలయును.  స్వాతంత్ర్యమే, సర్వాభ్యుదయమునకూ, 


మూలము.' 
       'శంకరులవారి  తరువాత, అరవిందులవంటి మేధావి,



 ప్రపంచమునబుట్టలేదు. అతను విశ్వామిత్రునివంటివాడు.


 రజప్రేరితమైన యీ తపస్సు-శుద్ధ సాత్వికమై, పరిణామపేశలమైనది.


 విశ్వామిత్రుడు గాయత్రిని సృష్టించినట్లే, యరవిందులు,  భాగవత జీవన


విధానమును, నిర్ణయించెను.'
    'హిమాలయము వంటి మేధస్సు, క్షీరసముద్రము  వంటి కవితాశక్తీ-



రెండింటినీ జోడించిన యరవిందుల  మూర్తి-చిత్రాతిచిత్రమైనది.' 

   ఇలాంటి యెన్నో పుట్టపర్తివ్యాఖ్యలతో కూడిన యీ చిన్ని పొత్తము,

 
చిత్తూరులో యి 19, 20వ తేదీలలో జరుగుతున్న


రాష్ట స్థాయి అరబిందో సంస్మరణ


సభల సందర్భంగా పునర్మిద్రింపబడుతున్నది.


(నేనుకూడా వెళ్తున్నాను.) 

  అరబిందో భావజాలాన్నీ, మార్క్క్ భావజాలాన్నీ కలిపి కొత్త సిద్ధంతాన్ని 



 యెవరైనా కనిపెడితే బాగుండేదనీ, తనకిప్పుడు అ విశ్లేషణ చేయదగినంత


మానసిక, దైహిక శక్తులు లెవనీ తన చివరి రోజుల్లో వాపోయేవారు  (ఈ దిశగా


యెవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడటం లేదింకా.) .


  అరవిందులవారి ప్రభావం పుట్టపర్తిమీద నిండుగా మెండుగా వుంది మరి... 

Monday, 14 December 2015

punnaga :               నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3...

punnaga :

              నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3

...
:               నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3 కడప మోచంపేట (అసలు పేరు మోక్షంపేట అట..క్రమంగా నోరుతిరగక అది మోచంపేటగా ప్రజల్లో స్థిర...

Thursday, 3 December 2015

Friendz dears....This post shows how thick was the


friendship of maa ayyagaru with Jammalamadakavaru.


....(courtesy- sri Ramavajhala Srisailam)









Wednesday, 2 December 2015


Part 5 (Final).of  Puttaparthi about Gurajada

కన్యక, పూర్ణమ్మ కథ రెండూ కరుణాత్మక కావ్యాలు.
 యెంతో గంభీరమైన భావాలను కూడా సూటిగా హృదయాలకు తాకేటట్లు తేటగా పిల్లలకు అర్థమయ్యేట్లు చెప్పడం గురజాడలోని మహా శక్తి. కన్యకలోని ఇతివృత్తాన్ని మరేవి ఐనా గంభీరమైన ప్రౌఢ కావ్యంగా మార్చి
వుండును. పూర్ణమ్మ కథలోని కరుణ మహ సుకుమరమైనది. దీనిలో యెత్తుగడ, అంతమూ- యెంతటి గంభీర హృదయాలనైన చలింపచేసేటంత లలితంగా వున్నయి. ఇంత సరళంగా, సూటిగా, సుకుమరంగా చెప్పగలగడం మహాకవులకు మత్రమే సాధ్యమౌతుంది. అ చిత్తవృత్తిలో అయన బాలసాహిత్యం వ్రాసివుంటే యెంత బాగుండునో ! (గురజాడ సాహిత్య విశిష్టతను పుట్టపర్తివారు ఆవిష్కరించిన తీరు చదువరులలో గురజాడవారిపట్ల అంతులెని గౌరవం పెంచటంతోపాటూ, పుట్టపర్తివారి బహు భాషావైదగ్ధ్యమూ, నిశిత పరిశీలనా శక్తి పట్ల కూడా ఆశ్చర్యానందాలు కలుగజేస్తుందనటంలో సందేహం లేదనిపిస్తుంది - నామట్టుకు నాకు ! యేమంటారు సహృదయ మిత్రులారా ! డా. వేదగిరి రాంబాబుగారు చాలాకాలంగా గురజాడవారి సహిత్యానికి అపారమైన సేవ చేస్తున్నారు. అనేకానేక ప్రాంతలలో, యెంతో శ్రమకోర్చి, సమావేశాలు నిర్వహించారు. ఇటీవల గురజాడవారి వర్ధంతి నాడు, (30th nov) శ్రీయుత విహారి, సుధామగారల సంపాదకత్వంలో ఆ మహనీయునికి సరికొత్త కథానిక, కవితానివాళులర్పించి కొత్త వొరవడిని సృష్టించారు. (కవితానివాళిలో నా చిన్న కవితకూ స్థానం దక్కటం నా అదృష్టంగా భావిస్తున్నాను.) సాంస్కృతిక రాజకీయ రంగలలో సవ్యసాచి శ్రీమాన్ రమణాచారిగారి నిండు ఆశీస్సులతో జరిగిన యీ వేడుక మరిన్ని కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతుందని ఆశిస్తూ...నాగపద్మిని పుట్టపర్తి)
..................... 











   Part 4 pl....
................
ఆయన ప్రయత్నించిన సామాజిక విప్లవం కూడా చాలా గొప్పది. తన కాలానికి   అతీతమైన సామాజిక దృష్టి ఆయనకుండేది. ఆయన కథలలో ఆ దృష్టి బాగా కనబడుతుంది.
 ఇక ఆయన హాస్యం తెలుగు సాహిత్యంలో సాటి లేనిది. ఆయన వుత్తరాలలో, వ్యాసాల్లోకూడా ఈ హాస్య దృష్టి కనబడుతుంది. సర్కస్ బఫూన్లు చేసే ఆంగిక వికారాలతోనూ,  కృతకమైన  శబ్ద చమత్కరాలతోనూ సృష్టించే హాస్యం అల్పమైనది. కన్యాశుల్కంలోని హాస్యం పాత్రల  స్వాభావిక ప్రవర్తనలోనూ, కథకు సహజమైన సన్నివేశాలతోనూ  ఇమిడి వుంది. ఇటువంటి హాస్యమే ఉత్కృష్టమైనది. గురజడ షృష్టించినట్టి హాస్యం నాజూకైన హాస్యం తెలుగులో మరిలేదు. గురజాడ కవిత్వంలో అంగ్ల సాహిత్యపు చాయలు వున్నయి. మొత్తం మీద ఇంగ్లీషు ప్రభావం ఆయనమీద యెక్కువగా వుందని చెప్పవచ్చు. ఆంగ్ల  విద్యమీద అయనకు అమితమైన గౌరవం. ఇది ఆనాటి కాల  ప్రభావమని చెప్పవచ్చు.  ఇంగ్లీషురాని పండితులు ఆనాడు  మహా చాందసులు. కూపస్థ మండూకాలు. ఇంగ్లీషు విద్య వచ్చినవారే అంతో ఇంతో విశాలంగా ఆలోచించగలిగేవాళ్ళు. ఇంగ్లీషువిద్య వల్లనే స్వతంత్ర ఆలోచనాశక్తీ, విశాల దృష్టీ అలవడుతాయని అనుకోవడం ఆనాటి పరిస్థితుల్లో   న్యాయమే! ఆనాటి యుగ స్వభావమే ఆయనలో ప్రతిఫలించింది.
   ముత్యాలసరాలు ఆయన తెలుగు కవిత్వానికి ఇచ్చిన కానుక.  ఆ చందస్సులో అంత కొత్తదనం లేకపోయినా బంధ కవిత్వాలూ, గర్భ కవిత్వాలూ  వ్రాసుకునే  రోజుల్లో సరళమైన గెయచందస్సులో కవిత్వం వ్రాయబూనుకోవడమే ఒక విప్లవం. అయన  సుభద్ర లో అక్కడక్కడా కావ్య  భాష దొర్లింది. ఋతు శతకం అనేది సామాన్యులకు అర్థమయ్యేట్లు లేదు. వీటిని ఆయన చిన్నప్పుడు అంటే సాహిత్యాన్ని గురించే ఆయన విశ్వాసాలు పరిణతి చెందక మునుపు వ్రాసినాడేమో అనిపిస్తుంది. అయన ఖండ కావ్యాలు యేవేవి యెప్పుడెప్పుడు వ్రాసిందీ తేదీలు కూడా లభ్యమై వుంటే బాగుండేది. 
(ఇంకా వుంది...)
 

Tuesday, 1 December 2015

Part 3
 

తెలుగులో నన్నయభట్టే ఆదికవి అని చాలారోజులు అనుకునేవాళ్ళం. నన్నయ భారతంవంటి ప్రౌఢరచన హఠాత్తుగా ఒకనాడు ఆవిర్భవించిందంటే నమ్మడం చాలా కష్టం. యెన్నో తరాలుగా యెంతమంది విస్మృత కవుల చేతిలోనో తెలుగు కవిత్వం క్రమ క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చి, నన్నయనాటికి, భారతం పరిపక్వ స్థితికి వచ్చిందనుకోవటం సమంజసం. ముఖ్యంగా బౌద్ధులూ, జైనులూ దేశీయ భాష ఐన తెలుగులో యెన్నో కావ్యాలు వ్రాసివుంటారని నా విశ్వాసం. ఆ యుగాలనాటి మతకలహాలలో హిందూ దురభిమానులు తమది పైచేయైనప్పుడు, ఆ సాహిత్యాన్నంతా నాశనం చేసి ఉంటారు. గురజాడ బతికి వున్నప్పుడే యుద్ధమల్లుని బెజవాడ శాసనం దొరికింది. యుద్ధమల్లుడే ఆదికవి అని ఆయన సాహసంగా గుర్తించినాడు. కన్నడంలోని పంపభారతం గురించికూడా ప్రస్తావించినాడు. నన్నయ భారతంలో పంపభారతం యొక్క ప్రభావం కనబడుతున్నదని కొన్ని యేండ్ల కిందట ఆలంపూర్ సాహిత్య సభలో నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు తెలుగు భక్తులందరూ నా మీద విరుచుక పడినారు. నేనసలు తెలుగువాణ్ణే కాదనీ, మారువేషంలో వున్న కన్నడంవాణ్ణనీ నన్ను నిందించారు. నేను చెప్పిన అభిప్రాయం గురజాడ ఆనాడే వెలిబుచ్చినాడు. కానీ తెలుగువాళ్ళ దురభిమానం మితిలేనిది. నన్నయ మహాకవి అంటే వాళ్ళకు తృప్తిలేదు. నన్నయ ఋషి అనే చాదస్తులూ, నన్నయ దేవుడు అనే మూర్ఖులూ బయలుదేరినారు..

గురజాడ చిన్నప్పటినుండే ఇంగ్లీషులో గద్య పద్యాలలో రచనలు చేసేవాడు. సంస్కృతం బాగా రావటమే కాక సంస్కృత వ్యాకరణంతో కూడా మంచి పరిచయం వున్నట్టు వూహించవచ్చు. అనంద గజపతి మహా ప్రౌఢుడైన కవి. అయనచుట్టూ, దిగ్దంతులవంటి పండితుల గౌరవం పొందినాడంటే వారి పాండిత్యం సామాన్యంగా వుండదు.
గజపతి వంటివారు, గురజాడను ఆదరించడం ఒక ఆశ్చర్యమైన విషయం.
.....................

గురజాడ సాధించిన సాహిత్య విప్లవం చాలా గొప్పది. బాల వ్యాకరణ ప్రౌఢ వ్యాకరణ సూత్రాలకు లోబడిన ప్రయోగాలు తెలుగులో చాలా యెక్కువగా వున్నయి. ఆంధ్ర శబ్ద చింతామణి మొదలుకొని తెలుగు వ్యాకరణాలన్నీ చాలా సంకుచితమైన దృష్టి గలవి. మన వ్యాకర్తలు శైవ సాహిత్యాన్ని గుర్తించనేలేదు. కృష్ణరాయల తరువాత వచ్చిన ప్రబంధాలకూ, మధుర తంజావూరు రాజుల కాలంలో వచ్చిన వచన సాహిత్యనికీ వాళ్ళూ యేమాత్రమూ విలువ ఇవ్వలేదు. అందుకనే ఆ వ్యాకరణాలు అంత సంకుచితంగా తయారైనాయి. అసలు ఒక జీవద్భాషను వ్యాకరణ సూత్రాలలో బంధింపజూడటమే కుంజర యూధమును దోమ కుత్తుకలో యిరికించడానికి చేసే ప్రయత్నం వంటిది. జీవద్భష ఐన తెలుగులో అనంతమైన ప్రాంతీయ భేదాలున్నాయి. అట్లే, సంస్కృతంలోనూ పాణిని వ్యాకరణానికి వ్యతిరేకమైన ప్రయోగాలు అనేకం - వ్యాసునిలో, వాల్మీకిలో, అంతకు పూర్వపు వైదిక సాహిత్యంలో వున్నాయి. సంస్కృతం జీవద్భాషగా వున్న రోజుల్లో బౌద్ధ జైన వాజ్మయాలలొ యీనాటి మహాపండితులకు కూడా అర్థం తెలియని ప్రయోగాలు అనేకం చేయబడ్డాయి. కాబట్టి జీవన భాషను వ్యాకరణపు సంకెళ్ళలో బంధించబూనుకోవడం సాహితీపరులెవ్వరూ సహింపకూడని విషయం. యీదృష్టితో వ్యాకరణ భక్తులకు వ్యతిరేకంగా గురజాడచేసిన రచనలు తెలుగు సాహిత్యానికి నూత్న యౌవనం ప్రసాదించినాయి. సశేషం...(ఇది 1968 ప్రాంతాలలో కడపలో జరిగిన గురజాడ వర్ధంతి సభలో పుట్టపర్తివారు వెలువరించిన అభిప్రాయాలకు అభిప్రాయాలకు విశాలాంధ్ర వార్తా పత్రిక ప్రకటించిన విపుల వార్తా వ్యాఖ్యలోని భాగం)
                                                    2-12-15


Monday, 30 November 2015


.................
      గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలెఉగులో  అటువంటిది మరి లేదు.  అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే  అటువంటిది లేదనటానికి   సాహసించరాదు. అలగే మధురవాణి పాత్ర విషయం. మధురవాణి పాత్ర  గొప్పదేకానీ, వసంతసేన కంటే గొప్పదని నేననలేను. గురజాడకు కూడా ఇలాంటి అభిప్రాయాలున్నాయి. చాసర్   వాల్మికి వంటివాడని గురజాడ అభిప్రాయపడ్డాడు. చాసర్  మీద ఇంగ్లీషువాళ్ళకే లేని గౌరవం, యీయనకెందుకు కలిగిందో నాకు అర్థం కావటంలేదు. అట్లే వర్డ్సవర్త్ మీద కూడా గురజాడకు విపరీతమైన  గౌరవం. వర్డ్స్వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా రాజుల రాణుల ప్రేమ పురాణాలూ, వీరగాధలే! సామాన్యుల జీవితాన్ని ప్రతిపాదించే  కావ్యాలు కూడా చాలావరకు యీవిధంగానే వుందనవచ్చు.  కానీ,  సంస్కృత  ప్రాకృతాల్లో మాగధి, అపభ్రంశ వంటి భాషల్లో సామాన్యుల గాధలు అనేకం ఉన్నాయి. జైన బౌద్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే !   ప్రసిద్ధమైన  గాధాసప్త శతి
   గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలుగులో   అటువంటిది మరి లేదు.  అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే  అటువంటిది లేదనటానికి   సాహసించరాదు. అలగే మధురవాణి పాత్ర విషయం. మధురవాణి పాత్ర  గొప్పదేకానీ, వసంతసేన కంటే గొప్పదని నేననలేను. గురజాడకు కూడా ఇలాంటి అభిప్రాయాలున్నాయి. చాసర్   వాల్మికి వంటివాడని గురజాడ అభిప్రాయపడ్డాడు. చాసర్  మీద ఇంగ్లీషువాళ్ళకే లేని గౌరవం, యీయనకెందుకు కలిగిందో నాకు అర్థం కావటంలేదు. అట్లే వర్డ్స్  వర్త్ మీద కూడా గురజాడకు విపరీతమైన  గౌరవం. వర్డ్స్  వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా రాజుల రాణుల ప్రేమ పురాణాలూ, వీరగాధలే! సామాన్యుల జీవితాన్ని ప్రతిపాదించే  కావ్యాలు కూడా చాలావరకు యీవిధంగానే వుందనవచ్చు.  కానీ,  సంస్కృత  ప్రాకృతాల్లో మాగధి, అపభ్రంశ వంటి భాషల్లో సామాన్యుల గాధలు అనేకం ఉన్నాయి. జైన బౌద్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే !   ప్రసిద్ధమైన  గాధాసప్త శతి ఆనాటి సామాన్యుల జీవితాన్ని చిత్రించే మనోహర సంకలనం. తెలుగులో మాత్రం మొన్న మొన్నటివరకు కవులు రాజులదగ్గర వేశ్యలవలెనే బ్రతికినారని  చెప్పవచ్చు. కానీ  తెలుగు సాహిత్యమంతా అట్టి సాహిత్యం అనలేము. (To be continued.....Friendz dears...Pl. note that this is the NEWS ITEM published in VISALANDHRA daily, on the GURAJADA vardhanti sabha hela at Kadapa  prabably in 1968, preserved and given to me by Sri Ramavajhala srisailamgaru, last year. )

(సంవత్సరం వివరాలు లేవుకానీ విశాలాంధ్ర వార్తాపత్రికలో చాలా విపులంగా వచ్చినె అంశమిది...)
                          గురజాడ మహా కవి మాత్రమే కాదు-
                          మహా పురుషుడు కూడా'  -  పుట్టపర్తి
కడప లో జరిగిన గురజాడ వర్ధంతి సభలో (30th Nov) పుట్టపర్తి నివాళి (తేదీ లేదు కానీ యీ విశేసలు విశాలాంధ్ర వర్తాపత్రికలో వచ్చాయి)
      పది వుపన్యాసాలకంటే, మహాకవి వాక్కు ఒక్కటి వేల  హృదయాలను కదిలింపగలదు. భావుకుడైన  కవికి అట్టి శక్తి ఉంది. సృజనాత్మక శక్తిలోని ఆ మెరుపును, అ ఆంతరిక జ్యోతిని గమనించి వినియోగించుకోలేకపోతే,  సామాజిక వుద్యమాలు తమ ప్రయోజనాలను  నెరవెర్చలేవు. నాటి సామాజిక వుద్యమాలకు  చేయూతనిచ్చిన గురజాడ ఒక విద్యుత్తు. ఆయన ఒక మహాకవే కాదు. ఒక మహాపురుషుడు కూడా! సాహిత్యకారులలో  చాలామందికి ఆత్మస్తుతి ఒక చాపల్యంగా వుంటుంది. ఆత్మవిశ్వాసం అన్న రూపంలో అది కొంతవరకూ అవసరమేమో  కూడా! కానీ దాని పాలు  మితిమీరితే దురభిమానం అనికూడా విమర్శించగలవాళ్ళున్నారు.  గురజాడమీద కూడా ఆ కాలంలో నిందాపూర్వకమైన దురుసు విమర్శలు కొన్ని వచ్చాయి. కానీ ఆయన అన్నింటినీ శాంతంగా పరిశీలించి, సరసంగా సమధానం చెప్పారు. గొప్పవాళ్ళ లక్షణం అది. అంతకంటే గొప్పది ఆయన  సాహసం. యెండుగడ్డి వంటి శుష్క పాండిత్యమే కవిత్వం అనుకునే రోజుల్లో, అంతమంది కవి వృషభులనూ, కవి శరభులనూ ధిక్కరించి, సంప్రదాయానికి  యెదురు నిలబడే సాహసం సామాన్యమైనది కాదు. ఆనాటి పండితులుకూడా  సామాన్యులేమీ కాదు. దిగ్దంతులవంటి వారు. శతావధానులు. వాళ్ళందరూ వ్యావహారిక భాషకు వ్యతిరేకులు. వాళ్ళ గ్రాంధిక  భాషావాదాన్ని చీల్చి చెండాడిన పిడుగు వంటి  గిడుగు లక్షణకతకాగా, ఆయన లక్షణాలకు  లక్ష్యంగా  గురజాడ సాహిత్య సృష్టి చేశాడు. 
     ఆనాటి సంఘ సంస్కరణోద్యమానికి వీరేశలింగం ఒక మహానేత. ఆయనకు అన్నివిధాలుగా అండదండలుగా వుండినవాడు గురజాడ. ఐనా , కందుకూరినికూడా విమర్శించేందుకు వెనుకాడని సత్యప్రియుడు గురజాడ. శ్రీ కందుకూరి రచనల్లోని శృంగారాన్ని నిస్సంకోచంగా ఆయన విమర్శించారు. 
  కవి క్రాంత దర్శి. నేటి పరిస్తుతులు గమనించి, రేపటికోసం సూచనలు చేయటమే క్రాంతదర్శి పని. అటువంటి గుణం గురజాడలో వుంది. ఒకనాటి అతివాదులు మరికొన్నాళ్ళకు మితవాదులు కావటం మనం చూస్తూనే వున్నాము. ఈ దృష్టితో చూస్తే గురజాడ యెల్లప్పటికీ అతివాది. అయన బ్రతికి వుంటే, మనలోని అతివాదులకంటే అతివాదిగా వుండేవాడనిపిస్తుంది. నాచ్ భోగం మేళాల సమస్య సానుల సమస్య,  కేవలం  నైతిక సమస్య అని ఆనాటి వాళ్ళ అభిప్రాయం. నీతిబోధనలతోనే సానులను సంస్కరించవచ్చునని అనుకునేవాళ్ళు. కానీ వేశ్యావృత్తి, ఆర్థిక సమస్యతో ముడిపడివుందని యీనాడు అందరికీ తెలిసినదే! ఆవిషయాన్ని అనాడే గుర్తించాడు గురజాడ. సంస్కర్త హృదయం అన్న కథలో ఆయనకున్న దృక్పథం స్పష్టంగా కనపడుతుంది. పరివర్తనచెందే కాలంతోపాటూ పరిణమించగల మేధస్సంపదా, విశాల హృదయమూ, సత్యప్రియత్వమూ మహాపురుషుని గొప్పగుణాలు.
      గురజాడ నిజంగా మహాకవి. ఆయనను ఇతరులతో పోల్చి, తెలుగువాళ్ళు గుడ్డివాళ్ళు కాబట్టి గురజాడ గొప్పదనాన్ని గుర్తించలేరని కొందరంటారు.  ఇందులో సత్యం ఉన్నమాట నిజమే కానీ, ఇలాంటి పోలికలు ఒక దౌర్బల్యం. వుదాహరణకు ఇక్బాల్, బంకిం ల రచనలు మనకు తెలియవు. మన కన్యాశుల్కం వంటి నాటకం తమిళులకు మళయాళీలకు లేనిమాట  నిజమే కావచ్చు. కానీ భారతి రచనల వంటి గానాత్మక కవిత్వం మనకు లేదు. అట్లే వల్లత్తోల్ వలె బహు గ్రంధాలను వుత్తమమైనవి  రచించిన మహాకవులు మనకు లేరు. తమ రచనలతో బీరువాలు నింపిన కవులు మనకూ ఉన్నారు. కానీ వాళ్ళు,  గుణంలో వల్లత్తోల్ కు దీటు రారు.  మన పరోక్షంలో కూడా ఇతరులు మన్నించేటట్లు మనం మాట్లాడుకోవడం న్యాయం.
    గురజాడ దేశభక్తి గీతం చాలా గొప్పది. తెలుగులో అటువంటిది మరిలేదు. అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలో అటువంటిది లేదు...
   (to be continued pl)

Sunday, 29 November 2015


Friends dears....
I think there is no need of any INTRO for the above post as it is COMPLETE one, which describes about mu AYYAGARU's thinking. I thank from my core of heart to Acharya Sreerangacharya for preserving this letter and sending this to VARTHA for printing and forwarding Dr. Puttaparthi to the next generation.

Sunday, 1 November 2015

punnaga : కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిల...

punnaga :



కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిల...
: కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిలో యీ పురస్కారం అందుకోవటం- యెంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమాన్ విజయసారధి గురువ...

Sunday, 25 October 2015


      మన దేశం, తత్వవేత్తలకూ, ఆధ్యాత్మిక గురువులకూ చాలా పేరొందినది. ఆయా కాలాలలో పలువురు ఆధ్యాత్మికవేత్తలు దేశ భవితను తీర్చిదిద్దే ప్రక్రియలోనూ తమవంతు పాత్ర పోషించినట్టు చరిత్ర చెబుతున్నది.
       విజయనగరసామ్రాజ్యస్థాపనకోసం విద్యారణ్యులవారి సమయోచిత చర్య ఇప్పటికీ ఆశ్చర్యజనకమైంది.  బలవంతంగా మతమార్పిడికి లోనై, కుంగిపోయివున్న హరిహర బుక్కరాయలను  మళ్ళీ హిందూమతంలోకి మార్చి, వారిరువురిలోనూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేశారు వారు. తన వుపాసనాశక్తితో అమ్మవారిని వేడుకున్నారు-హిందూసామ్రాజ్యస్థాపన స్వప్నానికి తగిన  భాగ్యరాశులను కురిపించమని! అమ్మ కనకవర్షం కురిపించి కరుణించింది. ఆ ధనంతో హరిహర బుక్కలకు తగిన  సైనిక బలం అన్ని హంగులతో చేకూరింది. విద్యారణ్యులవారి కల, విద్యానగర రూపంలో సాకారమైంది.విజయపరంపరలతో  విజయనగరమైంది.
       తులసీదాసు రామాయణం- ఉత్తర హిందూదేశంలో ప్రతిగడపలోనూ ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. తులసీదాసు కేవలం రామాయణ కావ్యకర్తగానే కాక,అప్పటి హిందూ సామ్రాజ్య పరిరక్షణకై సహకరించిన ఒక తపస్విగా కూడా మనకు పరిచయమవుతాడు 
రాణా ప్రతాపసిమ్హుని జీవిత సంఘటన ద్వారా!
          ఒకసారి వారు తన రామాయణ ప్రవచనం చెబుతున్నారట! సుందరకాండలో హనుమ వీరోచిత కార్యాలను సర్వమూ మైమరచి వింటున్నారందరూ! అందరికన్నా చివరగా ఆసీనుడై వున్నాడొక వ్యక్తి. ఆజానుబాహుడు.ముఖంలో నీరవత దోబూచులాడుతున్నా  రాజోచిత లక్షణాలతో ఏదో తెలియని ఆకర్షణ అతని ముఖంలో! ప్రవచనం ముగిసింది. అందరూ ఆనందోద్వేగాలతో కథగురించి చర్చించుకుంటూ వెళ్ళీపోయరు. కానీ యీ వ్యక్తి వెళ్ళలేదు.    తులసీదాసులవారు అతన్ని పిలిచారు. యెందుకింకా ఇక్కడే వున్నావని అడిగారు. అతను . 'స్వామి! మీరు మహాతపస్సంపన్నులు. మీ మహిమతో హనుమను పిలిచి హిందూ సామ్రాజ్య రక్షణచేయించండి.'  అన్నాడు. తులసీదాసుగారి మోమున చిరునవ్వు. 'హనుమ వంటి రాణా ప్రతాపసిం హుడున్నప్పుడిక హిందూ సామ్రాజ్యానికి భయమెక్కడిది?' అన్నారాయన. ఆ వ్యక్తి తల వినయంగా వంచి కన్నీరు కనబడనీయకుండా అన్నాడు 'ఆ నిస్సహాయుడైన రాణా ను నేనే స్వమీ' అని.తులసీ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాణా -  అక్బర్ సైన్యం ముందు తన  పరాజయం,  తనవద్ద తగిన సైన్య బలం లేని నిస్సహాయ స్థితిలో అడవులలో ఆకులూ, అలములూ తింటూ గడుపుతున్న ప్రస్తుత స్థితీ-  రాజా మాన్ సింగ్ ఆక్బర్ ఆజ్ఞ తో  తనకొసం తీవ్రంగా అడవులలోనూ గాలిస్తూ ఉండటం,  ఇవన్నీ వివరంగా చెప్పి, కాసేపు ఆగాడు. తులసీదాసుగారి వదనంలోనూ ఆందోళన! రాణా మళ్ళీ మొదలు పెట్టాడు. 'నా రోజులు బాగులేవు. నాకు కాస్త వ్యవధి చిక్కితే మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని ఆక్బర్ పై విజయం సాధిస్తాను.  ఇప్పుడీ మాన్ సింఘ్  నుంచీ నన్ను మీరే కాపాడాలి. అతన్ని నావైపు రాకుండా మీరే చేయాలి' అని విన్నవించుకున్నాడు. తులసీ హామీ ఇచ్చినమీదట అక్కడినుంచీ నిష్క్రమింఛాడు రాణా!
    రాణా  చెప్పినట్టే మాన్ సింగ్ వచ్చాడు. తులసీకి పాదాభివందనం చేశాడు. ఆద్యాత్మిక గురువులను యెవరైనా సరే గౌరవించే అచారం అప్పట్లో ఉండేది. 'నేనిచ్చే కానుకలు స్వీకరించండి. మీ సేవచేసుకునే భాగ్యం కలిగించండి'.అని ప్రార్థించాడు మాన్ సింగ్. తులసీ జవాబిది. 'ధనంతో నాకు పనేముంది నాయనా! నాకో మాటివ్వు. అది చాలు.'  మాన్ సింగ్ అంగీకారంగా తల వూచి, గురువుగారి ఆజ్ఞకై వేచి ఉన్నాడు.   తులసీ గంభీర స్వరం. 'రాణా నా ఆరాధకుడు. అతన్ని ప్రస్తుతానికి వదిలిపెట్టు. ఇది నా ఆజ్ఞ.' మాన్ సింఘ్ మారుమాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. రాణ తరువాత కొద్ది రోజులకు సైనిక బలం చేకూర్చుకుని ఆక్బర్ ను యెదుర్కొన్నాడు.
   ఇటువంటి యెన్నో విషయాలు మా అయ్యగారి రామాయణ ప్రవచనాలలో చిన్నప్పుడు వినేదాన్ని. ఇవే కాక, కాలభైరవొపాసన రహస్యాలు, ప్రత్యంగిరాదేవి, విదేశీయులెందరో మన సంస్కృతిపట్ల ఆకర్షితులైన, ఇప్పటికీ ఆకర్షితులవుతున్న  తీరు- ఇవన్నీ కుర్తాళ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద  భారతీస్వాములవారి ప్రవచనాల్లో వింటూ రోజూ తరిస్తున్నాను. 


పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతిగా,సుప్రసిద్ధ రచయితగా విఖ్యాతులైన వారిగురించి అయ్య మాటల్లోనూ తరచూ వినేదాన్ని. ఇటీవల యేదో విషయంగా  నా వద్ద వున్న అయ్య పుస్తకాలను తిరగేస్తూ వుంటే, ఒక ఇన్ లాండ్ లెటర్ చాలా పాతది దొరికింది. యేమిటబ్బా అని చూస్తే, ఆనందం,  ఆశ్చర్యం- ఒకే సారి ముప్పిరిగొన్నాయి.దాన్ని మీతోనూ పంచుకుందామనిపించి ఇలా......
                                                                                                    25-10-15

Tuesday, 29 September 2015

 'మరపురాని మధుర గాధ' 




'మరపురాని మధుర గాధ' 

   విజయనగర సామాజిక, చారిత్రక విశేషాలెన్నో వెలువరించే యీ గ్రంధాన్ని, 
(ఇదివరకు విజయనగర సామాజిక చరిత్ర అన్న పేరుతో 45 సంవత్సరాల క్రితం ముద్రింపబడి చాల సంవత్సరాలుగా మరుగున పడిఉన్న గ్రంధమిది) '70 ప్రాంతాలలో యెన్ని  సార్లు చదివి ఆ  లోకంలోనే విహరించి ఉంటానో గుర్తే లేదు.2009 లో దీన్ని విజయనగర సామ్రాజ్య కాలంలోనీ మరికొందరు సుప్రసిద్ధూలూ, సిద్ధులూ గురించి అయ్య ఆంధ్ర ప్రభలో వ్రాసిన లఘు వ్యాసాలతో కలిపి 'మరపురాని మధుర గాధ' గా ముద్రించాను. ఈ గ్రంధం గురించి లక్ష్మీదేవిగారి సహృదయ  స్పందన చూసి ఆనందం పట్టలేక పోతున్నా! నేను చేస్తున్న పని ఇలా జ్ఞానకాంక్ష ఉన్న పదుగురి దాహాన్ని తీరుస్తున్నదంటే ఆనందం! మహదానందం!  ఈ సందర్భంగా అయ్య అలభ్య గ్రంధాలనిలా పునర్ముద్రించటం వెనుక, నా ఆరాధనా, తపనా కూడా  మిత్రులతో పంచుకుందామనిపిస్తున్నది.  1996 లో నేను మా అయ్యగారి అలభ్య గ్రంధాలనూ,అసంకలిత వ్యాసాలనూ (సంకలనాలుగా) ముద్రించటం మొదలు పెట్టిన తొలి రోజుల్లో 'మహభారత విమర్శనం' (దీన్ని కూడా  తెలుగు యెమ్మే చేసేటపుడు చదివి, అయ్య పట్ల ఆరాధన హిమాలయమంత పెరిగిపోయింది.) ముద్రించి, మా అయ్య పాదాల దగ్గర పెట్టి, నా జన్మ ధన్యమయిందని అనంద బాష్పాలతో విన్నవించుకున్నాను. అటు తరువాత,నా తపన, నన్ను విశ్రాంతి తీసుకోనివ్వలేదసలు.. 'ప్రాకృత వ్యాస మంజరి'(అయ్యగారి  అసంకలిత ప్రచురిత వ్యాసాలు) 'వ్యాస వల్మీకం' (అయ్యగారి, దాక్షిణాత్య  సాహిత్య వ్యాసాలు)'సరస్వతీపుత్రునితో సంభాషణలు' (వివిధ పత్రికలలో వచ్చిన అయ్యగారితో ముఖాముఖి-పరిచయాలు)  'శివకర్ణామృతం' (అయ్య సంస్కృత రచన అర్థంతో సహా+శివతాండవ సహితంగా - యీ సంస్కృత కావ్యం ప్రచురణ వెనుక పెద్ద కథే ఉంది),'పెనుగొండలక్ష్మి', 'మరపురాని మధుర గాధ' (విజయనగర సామాజిక చరిత్ర+విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన ఇతర వ్యాసాలు)   అ తరువాత,ఇటీవల 'త్రిపుటి' (అయ్య అపురూప వ్యాసాలు+పుస్తక సమీక్షలు+పద్య వ్యాఖ్యలు+కామకోటి పత్రికకు వ్రాసిన సంపాదకీయాలు) ఇవన్నీ చేస్తున్న సమయాల, నా నరనరాల్లోనూ, అయ్య నామస్మరణే!   ఒక్కొక్క గ్రంధం ప్రచురిస్తున్నప్పుడూ,ఇటీవలే శివైక్యం చెందిన  శ్రీ రామవజ్ఝల శ్రీశైలం గారి సహకరం మరువలేనిది. అయ్య అసంకలిత వ్యాసాలు వారు ఇచ్చినప్పుడల్లా, వాటిని ఒక శీర్షిక క్రింద యెలా ప్రచురించాలి, పుస్తకం పేరేమి పెట్టాలి,ముఖచిత్రం యెలా ఉండాలి...వీటన్నిటి గురించీ ఆలోచిస్తూ,  నిద్రలేని రాత్రులెన్నెన్నో!   నా పనులన్నిటిలోనూ అడ్డుపెట్టక సహకరించిన నా కుటుంబ సభ్యులందరికీ, ఆ గ్రంధాలన్నిటినీ కొని చదివి పుట్టపర్తివారి  సాహితీ త్రివిక్రమత్వాన్ని అనుభూతించిన అయ్య అభిమానులకూ ధన్యవాదాలు.   ('త్రిపుటి'  ' 'పెనుగొండలక్ష్మి'  'శివతాండవము' (బాపూగారి చిత్రాలతో సహా)  ప్రతులు శివతాండవం ఆడియో సీ.డీ.    నవోదయ -ఆర్యసమాజ్ దగ్గర, కాచిగూడ క్రాస్ రోడ్స్   వద్ద  లభ్యములు)..    ప్రియ మిత్రులకు విన్నపం.ఈ గ్రంధాల ప్రచురణ ఒక పద్మవ్యూహం వంటిది. చేయి తిరిగిన ప్రచురణకర్తలకు తప్ప యీ రంగంలో సామాన్యులైన మా అయ్యగారివంటి సమ్మాన్యులకు కూడా అపజయాలే చవిచూడవలసి వచ్చేది. నావంటి అర్భకురాలి సంగతి చెప్పేందుకేముంది? ఐనా, అయ్య సేవలో లాభనష్టాల గురించి ఆలోచించి అడుగు వెనకేయటం నాకస్సలు నచ్చలేదు. అందుకే ప్రచురణరంగంలో అభిమన్యుని ఆరాధకురాలిగా అడుగు పెట్టాను. ఈ   అమ్మకాలవల్ల వచ్చే డబ్బుతో అయ్య మరో గ్రంధం వెలుగులోకి వస్తుందన్న నమ్మకమే నన్ను  ముందుకు నడిపిస్తున్నది..        

Thursday, 24 September 2015

    ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలోనూ, అటు మక్కా లోనూ జరిగిన ప్రమాదాల గురించి రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్న నేపథ్యంలో..  






      
      తప్పు యెక్కడ యే మతంలో యే ప్రాంతంలో   జరిగినా,  యెవరైనా 
దాన్ని సరైన కోణంలో చూడటం, వాస్తవాలను మాట్లాడగల్గటమే సరైన పద్ధతి. భగవంతుణ్ణయినా నిలదీయగలగటమే నిజమైన బాధ్యతగల్గిన పౌరుని (కళాకారులందరితో సహా) కనీస కర్తవ్యం.                    
        1967 ఆగష్ట్ 15, కామకోటి (కామకోటి పీఠ ప్రచురణ) సంపాదకీయంలో 
మా అయ్యగారు:
        ' ఈ నడుమ తిరుమలలో శ్రీనివాసుని ఆలయ ప్రాంగణమందే 
పంధొమ్మిది మంది మరణించినారు. కారణము-జనుల త్రొక్కిడి. క్యూ లో నిలిచికొన్న జనులకు అధికారులు  కల్పించిన అనుకూలముల వైభవము. ...ఈ దురాగతము పైన ఒక ట్రస్టీ బోర్డ్ సభ్యుడు చేసిన విచిత్ర వ్యాఖ్యానమొకటి ఉన్నది. అది మనందరమూ తెలిసికొనదగినది. 'పవిత్రమైన పుణ్య క్షేత్రములో ఇటువంటి సంఘటన జరగటమంటే,  స్వామికి యెక్కడైనా, యేదైనా అపరాధము యాత్రికుల వల్ల కానీ, పరిచారకుల వల్లకానీ, జరిగిందేమోనని అనుమానము కలదు.' ఓహోహో! తమ రాజకీయముల వాసన వెంకటేశ్వరుని  నామములకు కూడానంటించినారు. వారికి పై పద్ధతి యలవాటు. పాపమేమి సేతురు? ఒకడు తప్పు చేసిన, వాడు దిక్కులేనివాడైనచో, వాని బలగమునంతటినీ, మారణహోమమొనర్చెడు చిత్తవృత్తి రాజ్జకీయములందే! ఒక వేళ భగవంతుడు, వీరనుకొనునట్టివాడేయైనచో, అపరాధిని గుర్తించలేనట్టి గుడ్డివాడా  వెంకటేశ్వరుడు?
 ..శ్రీహరి సూక్తి 'యెక్కడో తన్నిన యెక్కడో యేమో జరిగినట్లున్నది.ఓహో స్వామి! నీవు దయామయుండవని మా విశ్వాసము. అన్నమయ్య నిన్ను
 'దయ కరుడుగట్టిన మూర్తి'గా వర్ణించెను. అట్టి నీవు, రాజకీయ వాదుల సూక్తులలో యెన్ని వేషములు వేయుచున్నావు? నీ దర్శనమునకై వచ్చిన జనముల్ను తొక్కుకొని  నిన్ను జూడ వచ్చిన 'మనుష్యు ' లకు దర్శనమిచ్చినావా? నిజమా? ఇవ్వవలసినట్టిచ్చినావా? అయినచో నీకన్నను దయ్యమే మేలు.'

(త్రిపుటి-పుట్టపర్తి నారాయణాచార్యులవారి అపురూప పీఠికలు, వ్యాఖ్యలు, వ్యాస సంకలనం నుంచి - 2012 లో ప్రచురితం)  
                                  .........................                     

Monday, 14 September 2015

punnaga : విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి ...

punnaga :
విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి ...
: విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి కొన్ని అంశాలు)  ఆధునిక రామకావ్యాలలో విశ్వనాథ వారి కల్పవృక్షం, ఒక కమనీయ రమణీయ శిల్ప వృక...

Sunday, 13 September 2015

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...:  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్తున్న పుట్టపర్తివారి గురించిన వివరణ ఇది.అయ్యతో అనేక సంవత్సరాల అనుబంధం ఉన్న కామిశెట్టివార...