Wednesday 23 December 2015


శ్రీ అరవిందులవారి రాష్ట్ర స్థాయి సమావేశాలలో మా అయ్యగారిపై శ్రీ అరవిందులవారి ప్రభావం గురించి కొన్ని అనుభూతులను పంచుకునేనుదుకు డిసెంబర్ 19,20 తేదీలలో చిత్తూరుకు వెళ్ళిరావటం జరిగింది. అక్కడ నేను పాల్గొన్నప్పటి చాయాచిత్రాల్లివి. చాల విశేషాలు చెప్పాలని ఉంది. రెండు రోజుల్లో అక్కడి మరిన్ని విశేషాలు వివరంగా వ్రాస్తాను. అరవిందులవారి దర్శనం అయ్య తరచుగా చేసుకున్నా, అక్కడ శ్రీ అరవిందులవారితో వారి అనుభవలను యెంత ప్రయత్నించినా సేకరించలేక పోవటం- యెంతో నిరాశను కలిగించినా, అయ్య దగ్గర అరవిందులవారి 'ఊర్వశి' చదివిన జ్ఞాపకాలు మధురమైనవి. పదాల పోహళింపూ, భావ గాంభీర్యతా- అనితర సాధ్యాలే కాక, అనుసరణకందనివి కూడా! అయ్యగారి భావజాలంలో అరవిందులవారి ప్రసక్తి సిద్ధాంతపరంగా, యెంతో సంక్లిష్టమైనదీ, సామాజిక ఆధ్యాత్మిక పరిశోధనతో కూడుకున్నది కూడా! అన్నట్టు, అక్కడ, మా అయ్యగారు, 1960లో వ్రాసిన విప్లవ యోగీశ్వరుడు, అన్న చిన్ని పొత్తము (ధర అమూల్యం) నా చేతులమీదుగా పునరావిష్కరింపబడటం- నా మహద్భాగ్యమే! ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులవారు యీ పుస్తక పునర్ముద్రణ చేయమని కార్యనిర్వాహకులకు, సూచించటం-ఆ విద్యాఖని   ఆదేశం అక్కడ పాటించటమూ- గొప్ప విషయం. అయ్య సంతానంలో ఒకదానిగా జన్మించటం- యెంత గొప్ప భాగ్యమో అవగతమౌతూ ఉంటుందిలాంటి సన్నివేశాలలో! చిత్తూరు వాసులే కాక, రాష్ట్రం లోని అనేక శ్రీ అరవింద సంస్థలనుండీ ప్రతినిధులెందరో పాల్గొన్నారక్కడ! దాదాపు, అందరికీ అయ్యతో యేదో ఒక జ్ఞాపకమూ, దాన్ని పదిలంగా గుర్తు పెట్టుకుని, నన్ను చూసిన వెంటనే వాళ్ళా సంగతి ప్రస్తావించటం చూస్తుంటే, అయ్య నిజంగా ప్రజాకవి అనే అనిపించిందండీ!
ఆచార్య కోవెలవారితో అయ్యగురించి, యెన్నో విషయాలు మాట్లాడుకోవటం  ఆనందాన్నిచ్చింది. వారు నన్నొక విషయమై దదాపు ఆజ్ఞాపించరనే అనవచ్చు. అదెమిటో త్వరలో చెబుతాగా!
ఇప్పటికీ ఫోటోలు చూడండి. ఫేస్ బుక్ స్నెహితులందరూ, పుస్తక ప్రదర్శన సందర్శనంలో చాలా బిజీగా ఉన్నారుకదామరి-మీ సమయం యెక్కువ తీసుకోకూడదనీ!  
ఇవిగో, యీ చాయాచిత్రాలు చూడండి, వీటి వివరణ త్వరలో!










Tuesday 15 December 2015

   అరబిందో మహర్షి గురించి మా అయ్యగారు  విప్లవయోగీశ్వరుడు అని


ఒక చిన్న పొత్తము, 1960 లో వ్రాశారు. అరవిందులవారి అవతరణ-


 రామకృష్ణ పరమహంస మహాసమాధి- ఆగష్ట్ 15 నే కావటం 


 ఘుణాక్షర న్యాయం వంటిదని కొందరంటారు కానీ, భారతదేశ స్వాతంత్ర


 సిద్ధి కూడా అదెరోజు కావటంలో యెదొ పెద్ద సందేశమే ఉందని వారి భావన.
 
డ్రూయట్  దంపతుల వద్ద తానున్న సమయంలో షేక్స్ పియర్ రచనలను


 తెగ చదివేవారట అరవిందులవారు! టెన్నీసన్,  వర్డ్స్ వర్త్ షెల్లీ,


కీట్స్..వీళ్ళందరి హృదయాలనూ వారు ఆపోసన పట్టేశారట!


అరవిందులవారి జీవిత సంగ్రహం వ్రాస్తూనే,  తనవైన వ్యాఖ్యలను
 
కూడా అక్కడక్కడా ఆనాడే వినిపించేవారు-పుట్టపర్తి వారు.



        'దేశభాషలెంత గొప్పవైననూ, భారతీయాత్మను సంపూర్ణముగా



వెల్లడింపలేవు. '
        'సాహిత్యము,  హృదయమును సంస్కరించుచూ, భావములు



విశాలమొనర్చును. కానీ,  సాధన, మర్గములనుపదేశించును.'

        'ఒక దేశము యొక్క విజ్ఞానము,  వికాసమొందవలెనన్నచో,  నా దేశము



 స్వతంత్రముగానుండవలయును.  స్వాతంత్ర్యమే, సర్వాభ్యుదయమునకూ, 


మూలము.' 
       'శంకరులవారి  తరువాత, అరవిందులవంటి మేధావి,



 ప్రపంచమునబుట్టలేదు. అతను విశ్వామిత్రునివంటివాడు.


 రజప్రేరితమైన యీ తపస్సు-శుద్ధ సాత్వికమై, పరిణామపేశలమైనది.


 విశ్వామిత్రుడు గాయత్రిని సృష్టించినట్లే, యరవిందులు,  భాగవత జీవన


విధానమును, నిర్ణయించెను.'
    'హిమాలయము వంటి మేధస్సు, క్షీరసముద్రము  వంటి కవితాశక్తీ-



రెండింటినీ జోడించిన యరవిందుల  మూర్తి-చిత్రాతిచిత్రమైనది.' 

   ఇలాంటి యెన్నో పుట్టపర్తివ్యాఖ్యలతో కూడిన యీ చిన్ని పొత్తము,

 
చిత్తూరులో యి 19, 20వ తేదీలలో జరుగుతున్న


రాష్ట స్థాయి అరబిందో సంస్మరణ


సభల సందర్భంగా పునర్మిద్రింపబడుతున్నది.


(నేనుకూడా వెళ్తున్నాను.) 

  అరబిందో భావజాలాన్నీ, మార్క్క్ భావజాలాన్నీ కలిపి కొత్త సిద్ధంతాన్ని 



 యెవరైనా కనిపెడితే బాగుండేదనీ, తనకిప్పుడు అ విశ్లేషణ చేయదగినంత


మానసిక, దైహిక శక్తులు లెవనీ తన చివరి రోజుల్లో వాపోయేవారు  (ఈ దిశగా


యెవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడటం లేదింకా.) .


  అరవిందులవారి ప్రభావం పుట్టపర్తిమీద నిండుగా మెండుగా వుంది మరి... 

Monday 14 December 2015

punnaga :               నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3...

punnaga :

              నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3

...
:               నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3 కడప మోచంపేట (అసలు పేరు మోక్షంపేట అట..క్రమంగా నోరుతిరగక అది మోచంపేటగా ప్రజల్లో స్థిర...

Thursday 3 December 2015

Friendz dears....This post shows how thick was the


friendship of maa ayyagaru with Jammalamadakavaru.


....(courtesy- sri Ramavajhala Srisailam)









Wednesday 2 December 2015


Part 5 (Final).of  Puttaparthi about Gurajada

కన్యక, పూర్ణమ్మ కథ రెండూ కరుణాత్మక కావ్యాలు.
 యెంతో గంభీరమైన భావాలను కూడా సూటిగా హృదయాలకు తాకేటట్లు తేటగా పిల్లలకు అర్థమయ్యేట్లు చెప్పడం గురజాడలోని మహా శక్తి. కన్యకలోని ఇతివృత్తాన్ని మరేవి ఐనా గంభీరమైన ప్రౌఢ కావ్యంగా మార్చి
వుండును. పూర్ణమ్మ కథలోని కరుణ మహ సుకుమరమైనది. దీనిలో యెత్తుగడ, అంతమూ- యెంతటి గంభీర హృదయాలనైన చలింపచేసేటంత లలితంగా వున్నయి. ఇంత సరళంగా, సూటిగా, సుకుమరంగా చెప్పగలగడం మహాకవులకు మత్రమే సాధ్యమౌతుంది. అ చిత్తవృత్తిలో అయన బాలసాహిత్యం వ్రాసివుంటే యెంత బాగుండునో ! (గురజాడ సాహిత్య విశిష్టతను పుట్టపర్తివారు ఆవిష్కరించిన తీరు చదువరులలో గురజాడవారిపట్ల అంతులెని గౌరవం పెంచటంతోపాటూ, పుట్టపర్తివారి బహు భాషావైదగ్ధ్యమూ, నిశిత పరిశీలనా శక్తి పట్ల కూడా ఆశ్చర్యానందాలు కలుగజేస్తుందనటంలో సందేహం లేదనిపిస్తుంది - నామట్టుకు నాకు ! యేమంటారు సహృదయ మిత్రులారా ! డా. వేదగిరి రాంబాబుగారు చాలాకాలంగా గురజాడవారి సహిత్యానికి అపారమైన సేవ చేస్తున్నారు. అనేకానేక ప్రాంతలలో, యెంతో శ్రమకోర్చి, సమావేశాలు నిర్వహించారు. ఇటీవల గురజాడవారి వర్ధంతి నాడు, (30th nov) శ్రీయుత విహారి, సుధామగారల సంపాదకత్వంలో ఆ మహనీయునికి సరికొత్త కథానిక, కవితానివాళులర్పించి కొత్త వొరవడిని సృష్టించారు. (కవితానివాళిలో నా చిన్న కవితకూ స్థానం దక్కటం నా అదృష్టంగా భావిస్తున్నాను.) సాంస్కృతిక రాజకీయ రంగలలో సవ్యసాచి శ్రీమాన్ రమణాచారిగారి నిండు ఆశీస్సులతో జరిగిన యీ వేడుక మరిన్ని కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతుందని ఆశిస్తూ...నాగపద్మిని పుట్టపర్తి)
..................... 











   Part 4 pl....
................
ఆయన ప్రయత్నించిన సామాజిక విప్లవం కూడా చాలా గొప్పది. తన కాలానికి   అతీతమైన సామాజిక దృష్టి ఆయనకుండేది. ఆయన కథలలో ఆ దృష్టి బాగా కనబడుతుంది.
 ఇక ఆయన హాస్యం తెలుగు సాహిత్యంలో సాటి లేనిది. ఆయన వుత్తరాలలో, వ్యాసాల్లోకూడా ఈ హాస్య దృష్టి కనబడుతుంది. సర్కస్ బఫూన్లు చేసే ఆంగిక వికారాలతోనూ,  కృతకమైన  శబ్ద చమత్కరాలతోనూ సృష్టించే హాస్యం అల్పమైనది. కన్యాశుల్కంలోని హాస్యం పాత్రల  స్వాభావిక ప్రవర్తనలోనూ, కథకు సహజమైన సన్నివేశాలతోనూ  ఇమిడి వుంది. ఇటువంటి హాస్యమే ఉత్కృష్టమైనది. గురజడ షృష్టించినట్టి హాస్యం నాజూకైన హాస్యం తెలుగులో మరిలేదు. గురజాడ కవిత్వంలో అంగ్ల సాహిత్యపు చాయలు వున్నయి. మొత్తం మీద ఇంగ్లీషు ప్రభావం ఆయనమీద యెక్కువగా వుందని చెప్పవచ్చు. ఆంగ్ల  విద్యమీద అయనకు అమితమైన గౌరవం. ఇది ఆనాటి కాల  ప్రభావమని చెప్పవచ్చు.  ఇంగ్లీషురాని పండితులు ఆనాడు  మహా చాందసులు. కూపస్థ మండూకాలు. ఇంగ్లీషు విద్య వచ్చినవారే అంతో ఇంతో విశాలంగా ఆలోచించగలిగేవాళ్ళు. ఇంగ్లీషువిద్య వల్లనే స్వతంత్ర ఆలోచనాశక్తీ, విశాల దృష్టీ అలవడుతాయని అనుకోవడం ఆనాటి పరిస్థితుల్లో   న్యాయమే! ఆనాటి యుగ స్వభావమే ఆయనలో ప్రతిఫలించింది.
   ముత్యాలసరాలు ఆయన తెలుగు కవిత్వానికి ఇచ్చిన కానుక.  ఆ చందస్సులో అంత కొత్తదనం లేకపోయినా బంధ కవిత్వాలూ, గర్భ కవిత్వాలూ  వ్రాసుకునే  రోజుల్లో సరళమైన గెయచందస్సులో కవిత్వం వ్రాయబూనుకోవడమే ఒక విప్లవం. అయన  సుభద్ర లో అక్కడక్కడా కావ్య  భాష దొర్లింది. ఋతు శతకం అనేది సామాన్యులకు అర్థమయ్యేట్లు లేదు. వీటిని ఆయన చిన్నప్పుడు అంటే సాహిత్యాన్ని గురించే ఆయన విశ్వాసాలు పరిణతి చెందక మునుపు వ్రాసినాడేమో అనిపిస్తుంది. అయన ఖండ కావ్యాలు యేవేవి యెప్పుడెప్పుడు వ్రాసిందీ తేదీలు కూడా లభ్యమై వుంటే బాగుండేది. 
(ఇంకా వుంది...)
 

Tuesday 1 December 2015

Part 3
 

తెలుగులో నన్నయభట్టే ఆదికవి అని చాలారోజులు అనుకునేవాళ్ళం. నన్నయ భారతంవంటి ప్రౌఢరచన హఠాత్తుగా ఒకనాడు ఆవిర్భవించిందంటే నమ్మడం చాలా కష్టం. యెన్నో తరాలుగా యెంతమంది విస్మృత కవుల చేతిలోనో తెలుగు కవిత్వం క్రమ క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చి, నన్నయనాటికి, భారతం పరిపక్వ స్థితికి వచ్చిందనుకోవటం సమంజసం. ముఖ్యంగా బౌద్ధులూ, జైనులూ దేశీయ భాష ఐన తెలుగులో యెన్నో కావ్యాలు వ్రాసివుంటారని నా విశ్వాసం. ఆ యుగాలనాటి మతకలహాలలో హిందూ దురభిమానులు తమది పైచేయైనప్పుడు, ఆ సాహిత్యాన్నంతా నాశనం చేసి ఉంటారు. గురజాడ బతికి వున్నప్పుడే యుద్ధమల్లుని బెజవాడ శాసనం దొరికింది. యుద్ధమల్లుడే ఆదికవి అని ఆయన సాహసంగా గుర్తించినాడు. కన్నడంలోని పంపభారతం గురించికూడా ప్రస్తావించినాడు. నన్నయ భారతంలో పంపభారతం యొక్క ప్రభావం కనబడుతున్నదని కొన్ని యేండ్ల కిందట ఆలంపూర్ సాహిత్య సభలో నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు తెలుగు భక్తులందరూ నా మీద విరుచుక పడినారు. నేనసలు తెలుగువాణ్ణే కాదనీ, మారువేషంలో వున్న కన్నడంవాణ్ణనీ నన్ను నిందించారు. నేను చెప్పిన అభిప్రాయం గురజాడ ఆనాడే వెలిబుచ్చినాడు. కానీ తెలుగువాళ్ళ దురభిమానం మితిలేనిది. నన్నయ మహాకవి అంటే వాళ్ళకు తృప్తిలేదు. నన్నయ ఋషి అనే చాదస్తులూ, నన్నయ దేవుడు అనే మూర్ఖులూ బయలుదేరినారు..

గురజాడ చిన్నప్పటినుండే ఇంగ్లీషులో గద్య పద్యాలలో రచనలు చేసేవాడు. సంస్కృతం బాగా రావటమే కాక సంస్కృత వ్యాకరణంతో కూడా మంచి పరిచయం వున్నట్టు వూహించవచ్చు. అనంద గజపతి మహా ప్రౌఢుడైన కవి. అయనచుట్టూ, దిగ్దంతులవంటి పండితుల గౌరవం పొందినాడంటే వారి పాండిత్యం సామాన్యంగా వుండదు.
గజపతి వంటివారు, గురజాడను ఆదరించడం ఒక ఆశ్చర్యమైన విషయం.
.....................

గురజాడ సాధించిన సాహిత్య విప్లవం చాలా గొప్పది. బాల వ్యాకరణ ప్రౌఢ వ్యాకరణ సూత్రాలకు లోబడిన ప్రయోగాలు తెలుగులో చాలా యెక్కువగా వున్నయి. ఆంధ్ర శబ్ద చింతామణి మొదలుకొని తెలుగు వ్యాకరణాలన్నీ చాలా సంకుచితమైన దృష్టి గలవి. మన వ్యాకర్తలు శైవ సాహిత్యాన్ని గుర్తించనేలేదు. కృష్ణరాయల తరువాత వచ్చిన ప్రబంధాలకూ, మధుర తంజావూరు రాజుల కాలంలో వచ్చిన వచన సాహిత్యనికీ వాళ్ళూ యేమాత్రమూ విలువ ఇవ్వలేదు. అందుకనే ఆ వ్యాకరణాలు అంత సంకుచితంగా తయారైనాయి. అసలు ఒక జీవద్భాషను వ్యాకరణ సూత్రాలలో బంధింపజూడటమే కుంజర యూధమును దోమ కుత్తుకలో యిరికించడానికి చేసే ప్రయత్నం వంటిది. జీవద్భష ఐన తెలుగులో అనంతమైన ప్రాంతీయ భేదాలున్నాయి. అట్లే, సంస్కృతంలోనూ పాణిని వ్యాకరణానికి వ్యతిరేకమైన ప్రయోగాలు అనేకం - వ్యాసునిలో, వాల్మీకిలో, అంతకు పూర్వపు వైదిక సాహిత్యంలో వున్నాయి. సంస్కృతం జీవద్భాషగా వున్న రోజుల్లో బౌద్ధ జైన వాజ్మయాలలొ యీనాటి మహాపండితులకు కూడా అర్థం తెలియని ప్రయోగాలు అనేకం చేయబడ్డాయి. కాబట్టి జీవన భాషను వ్యాకరణపు సంకెళ్ళలో బంధించబూనుకోవడం సాహితీపరులెవ్వరూ సహింపకూడని విషయం. యీదృష్టితో వ్యాకరణ భక్తులకు వ్యతిరేకంగా గురజాడచేసిన రచనలు తెలుగు సాహిత్యానికి నూత్న యౌవనం ప్రసాదించినాయి. సశేషం...(ఇది 1968 ప్రాంతాలలో కడపలో జరిగిన గురజాడ వర్ధంతి సభలో పుట్టపర్తివారు వెలువరించిన అభిప్రాయాలకు అభిప్రాయాలకు విశాలాంధ్ర వార్తా పత్రిక ప్రకటించిన విపుల వార్తా వ్యాఖ్యలోని భాగం)
                                                    2-12-15


Monday 30 November 2015


.................
      గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలెఉగులో  అటువంటిది మరి లేదు.  అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే  అటువంటిది లేదనటానికి   సాహసించరాదు. అలగే మధురవాణి పాత్ర విషయం. మధురవాణి పాత్ర  గొప్పదేకానీ, వసంతసేన కంటే గొప్పదని నేననలేను. గురజాడకు కూడా ఇలాంటి అభిప్రాయాలున్నాయి. చాసర్   వాల్మికి వంటివాడని గురజాడ అభిప్రాయపడ్డాడు. చాసర్  మీద ఇంగ్లీషువాళ్ళకే లేని గౌరవం, యీయనకెందుకు కలిగిందో నాకు అర్థం కావటంలేదు. అట్లే వర్డ్సవర్త్ మీద కూడా గురజాడకు విపరీతమైన  గౌరవం. వర్డ్స్వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా రాజుల రాణుల ప్రేమ పురాణాలూ, వీరగాధలే! సామాన్యుల జీవితాన్ని ప్రతిపాదించే  కావ్యాలు కూడా చాలావరకు యీవిధంగానే వుందనవచ్చు.  కానీ,  సంస్కృత  ప్రాకృతాల్లో మాగధి, అపభ్రంశ వంటి భాషల్లో సామాన్యుల గాధలు అనేకం ఉన్నాయి. జైన బౌద్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే !   ప్రసిద్ధమైన  గాధాసప్త శతి
   గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలుగులో   అటువంటిది మరి లేదు.  అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే  అటువంటిది లేదనటానికి   సాహసించరాదు. అలగే మధురవాణి పాత్ర విషయం. మధురవాణి పాత్ర  గొప్పదేకానీ, వసంతసేన కంటే గొప్పదని నేననలేను. గురజాడకు కూడా ఇలాంటి అభిప్రాయాలున్నాయి. చాసర్   వాల్మికి వంటివాడని గురజాడ అభిప్రాయపడ్డాడు. చాసర్  మీద ఇంగ్లీషువాళ్ళకే లేని గౌరవం, యీయనకెందుకు కలిగిందో నాకు అర్థం కావటంలేదు. అట్లే వర్డ్స్  వర్త్ మీద కూడా గురజాడకు విపరీతమైన  గౌరవం. వర్డ్స్  వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా రాజుల రాణుల ప్రేమ పురాణాలూ, వీరగాధలే! సామాన్యుల జీవితాన్ని ప్రతిపాదించే  కావ్యాలు కూడా చాలావరకు యీవిధంగానే వుందనవచ్చు.  కానీ,  సంస్కృత  ప్రాకృతాల్లో మాగధి, అపభ్రంశ వంటి భాషల్లో సామాన్యుల గాధలు అనేకం ఉన్నాయి. జైన బౌద్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే !   ప్రసిద్ధమైన  గాధాసప్త శతి ఆనాటి సామాన్యుల జీవితాన్ని చిత్రించే మనోహర సంకలనం. తెలుగులో మాత్రం మొన్న మొన్నటివరకు కవులు రాజులదగ్గర వేశ్యలవలెనే బ్రతికినారని  చెప్పవచ్చు. కానీ  తెలుగు సాహిత్యమంతా అట్టి సాహిత్యం అనలేము. (To be continued.....Friendz dears...Pl. note that this is the NEWS ITEM published in VISALANDHRA daily, on the GURAJADA vardhanti sabha hela at Kadapa  prabably in 1968, preserved and given to me by Sri Ramavajhala srisailamgaru, last year. )

(సంవత్సరం వివరాలు లేవుకానీ విశాలాంధ్ర వార్తాపత్రికలో చాలా విపులంగా వచ్చినె అంశమిది...)
                          గురజాడ మహా కవి మాత్రమే కాదు-
                          మహా పురుషుడు కూడా'  -  పుట్టపర్తి
కడప లో జరిగిన గురజాడ వర్ధంతి సభలో (30th Nov) పుట్టపర్తి నివాళి (తేదీ లేదు కానీ యీ విశేసలు విశాలాంధ్ర వర్తాపత్రికలో వచ్చాయి)
      పది వుపన్యాసాలకంటే, మహాకవి వాక్కు ఒక్కటి వేల  హృదయాలను కదిలింపగలదు. భావుకుడైన  కవికి అట్టి శక్తి ఉంది. సృజనాత్మక శక్తిలోని ఆ మెరుపును, అ ఆంతరిక జ్యోతిని గమనించి వినియోగించుకోలేకపోతే,  సామాజిక వుద్యమాలు తమ ప్రయోజనాలను  నెరవెర్చలేవు. నాటి సామాజిక వుద్యమాలకు  చేయూతనిచ్చిన గురజాడ ఒక విద్యుత్తు. ఆయన ఒక మహాకవే కాదు. ఒక మహాపురుషుడు కూడా! సాహిత్యకారులలో  చాలామందికి ఆత్మస్తుతి ఒక చాపల్యంగా వుంటుంది. ఆత్మవిశ్వాసం అన్న రూపంలో అది కొంతవరకూ అవసరమేమో  కూడా! కానీ దాని పాలు  మితిమీరితే దురభిమానం అనికూడా విమర్శించగలవాళ్ళున్నారు.  గురజాడమీద కూడా ఆ కాలంలో నిందాపూర్వకమైన దురుసు విమర్శలు కొన్ని వచ్చాయి. కానీ ఆయన అన్నింటినీ శాంతంగా పరిశీలించి, సరసంగా సమధానం చెప్పారు. గొప్పవాళ్ళ లక్షణం అది. అంతకంటే గొప్పది ఆయన  సాహసం. యెండుగడ్డి వంటి శుష్క పాండిత్యమే కవిత్వం అనుకునే రోజుల్లో, అంతమంది కవి వృషభులనూ, కవి శరభులనూ ధిక్కరించి, సంప్రదాయానికి  యెదురు నిలబడే సాహసం సామాన్యమైనది కాదు. ఆనాటి పండితులుకూడా  సామాన్యులేమీ కాదు. దిగ్దంతులవంటి వారు. శతావధానులు. వాళ్ళందరూ వ్యావహారిక భాషకు వ్యతిరేకులు. వాళ్ళ గ్రాంధిక  భాషావాదాన్ని చీల్చి చెండాడిన పిడుగు వంటి  గిడుగు లక్షణకతకాగా, ఆయన లక్షణాలకు  లక్ష్యంగా  గురజాడ సాహిత్య సృష్టి చేశాడు. 
     ఆనాటి సంఘ సంస్కరణోద్యమానికి వీరేశలింగం ఒక మహానేత. ఆయనకు అన్నివిధాలుగా అండదండలుగా వుండినవాడు గురజాడ. ఐనా , కందుకూరినికూడా విమర్శించేందుకు వెనుకాడని సత్యప్రియుడు గురజాడ. శ్రీ కందుకూరి రచనల్లోని శృంగారాన్ని నిస్సంకోచంగా ఆయన విమర్శించారు. 
  కవి క్రాంత దర్శి. నేటి పరిస్తుతులు గమనించి, రేపటికోసం సూచనలు చేయటమే క్రాంతదర్శి పని. అటువంటి గుణం గురజాడలో వుంది. ఒకనాటి అతివాదులు మరికొన్నాళ్ళకు మితవాదులు కావటం మనం చూస్తూనే వున్నాము. ఈ దృష్టితో చూస్తే గురజాడ యెల్లప్పటికీ అతివాది. అయన బ్రతికి వుంటే, మనలోని అతివాదులకంటే అతివాదిగా వుండేవాడనిపిస్తుంది. నాచ్ భోగం మేళాల సమస్య సానుల సమస్య,  కేవలం  నైతిక సమస్య అని ఆనాటి వాళ్ళ అభిప్రాయం. నీతిబోధనలతోనే సానులను సంస్కరించవచ్చునని అనుకునేవాళ్ళు. కానీ వేశ్యావృత్తి, ఆర్థిక సమస్యతో ముడిపడివుందని యీనాడు అందరికీ తెలిసినదే! ఆవిషయాన్ని అనాడే గుర్తించాడు గురజాడ. సంస్కర్త హృదయం అన్న కథలో ఆయనకున్న దృక్పథం స్పష్టంగా కనపడుతుంది. పరివర్తనచెందే కాలంతోపాటూ పరిణమించగల మేధస్సంపదా, విశాల హృదయమూ, సత్యప్రియత్వమూ మహాపురుషుని గొప్పగుణాలు.
      గురజాడ నిజంగా మహాకవి. ఆయనను ఇతరులతో పోల్చి, తెలుగువాళ్ళు గుడ్డివాళ్ళు కాబట్టి గురజాడ గొప్పదనాన్ని గుర్తించలేరని కొందరంటారు.  ఇందులో సత్యం ఉన్నమాట నిజమే కానీ, ఇలాంటి పోలికలు ఒక దౌర్బల్యం. వుదాహరణకు ఇక్బాల్, బంకిం ల రచనలు మనకు తెలియవు. మన కన్యాశుల్కం వంటి నాటకం తమిళులకు మళయాళీలకు లేనిమాట  నిజమే కావచ్చు. కానీ భారతి రచనల వంటి గానాత్మక కవిత్వం మనకు లేదు. అట్లే వల్లత్తోల్ వలె బహు గ్రంధాలను వుత్తమమైనవి  రచించిన మహాకవులు మనకు లేరు. తమ రచనలతో బీరువాలు నింపిన కవులు మనకూ ఉన్నారు. కానీ వాళ్ళు,  గుణంలో వల్లత్తోల్ కు దీటు రారు.  మన పరోక్షంలో కూడా ఇతరులు మన్నించేటట్లు మనం మాట్లాడుకోవడం న్యాయం.
    గురజాడ దేశభక్తి గీతం చాలా గొప్పది. తెలుగులో అటువంటిది మరిలేదు. అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలో అటువంటిది లేదు...
   (to be continued pl)

Sunday 29 November 2015


Friends dears....
I think there is no need of any INTRO for the above post as it is COMPLETE one, which describes about mu AYYAGARU's thinking. I thank from my core of heart to Acharya Sreerangacharya for preserving this letter and sending this to VARTHA for printing and forwarding Dr. Puttaparthi to the next generation.

Sunday 1 November 2015

punnaga : కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిల...

punnaga :



కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిల...
: కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిలో యీ పురస్కారం అందుకోవటం- యెంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమాన్ విజయసారధి గురువ...

Sunday 25 October 2015


      మన దేశం, తత్వవేత్తలకూ, ఆధ్యాత్మిక గురువులకూ చాలా పేరొందినది. ఆయా కాలాలలో పలువురు ఆధ్యాత్మికవేత్తలు దేశ భవితను తీర్చిదిద్దే ప్రక్రియలోనూ తమవంతు పాత్ర పోషించినట్టు చరిత్ర చెబుతున్నది.
       విజయనగరసామ్రాజ్యస్థాపనకోసం విద్యారణ్యులవారి సమయోచిత చర్య ఇప్పటికీ ఆశ్చర్యజనకమైంది.  బలవంతంగా మతమార్పిడికి లోనై, కుంగిపోయివున్న హరిహర బుక్కరాయలను  మళ్ళీ హిందూమతంలోకి మార్చి, వారిరువురిలోనూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేశారు వారు. తన వుపాసనాశక్తితో అమ్మవారిని వేడుకున్నారు-హిందూసామ్రాజ్యస్థాపన స్వప్నానికి తగిన  భాగ్యరాశులను కురిపించమని! అమ్మ కనకవర్షం కురిపించి కరుణించింది. ఆ ధనంతో హరిహర బుక్కలకు తగిన  సైనిక బలం అన్ని హంగులతో చేకూరింది. విద్యారణ్యులవారి కల, విద్యానగర రూపంలో సాకారమైంది.విజయపరంపరలతో  విజయనగరమైంది.
       తులసీదాసు రామాయణం- ఉత్తర హిందూదేశంలో ప్రతిగడపలోనూ ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. తులసీదాసు కేవలం రామాయణ కావ్యకర్తగానే కాక,అప్పటి హిందూ సామ్రాజ్య పరిరక్షణకై సహకరించిన ఒక తపస్విగా కూడా మనకు పరిచయమవుతాడు 
రాణా ప్రతాపసిమ్హుని జీవిత సంఘటన ద్వారా!
          ఒకసారి వారు తన రామాయణ ప్రవచనం చెబుతున్నారట! సుందరకాండలో హనుమ వీరోచిత కార్యాలను సర్వమూ మైమరచి వింటున్నారందరూ! అందరికన్నా చివరగా ఆసీనుడై వున్నాడొక వ్యక్తి. ఆజానుబాహుడు.ముఖంలో నీరవత దోబూచులాడుతున్నా  రాజోచిత లక్షణాలతో ఏదో తెలియని ఆకర్షణ అతని ముఖంలో! ప్రవచనం ముగిసింది. అందరూ ఆనందోద్వేగాలతో కథగురించి చర్చించుకుంటూ వెళ్ళీపోయరు. కానీ యీ వ్యక్తి వెళ్ళలేదు.    తులసీదాసులవారు అతన్ని పిలిచారు. యెందుకింకా ఇక్కడే వున్నావని అడిగారు. అతను . 'స్వామి! మీరు మహాతపస్సంపన్నులు. మీ మహిమతో హనుమను పిలిచి హిందూ సామ్రాజ్య రక్షణచేయించండి.'  అన్నాడు. తులసీదాసుగారి మోమున చిరునవ్వు. 'హనుమ వంటి రాణా ప్రతాపసిం హుడున్నప్పుడిక హిందూ సామ్రాజ్యానికి భయమెక్కడిది?' అన్నారాయన. ఆ వ్యక్తి తల వినయంగా వంచి కన్నీరు కనబడనీయకుండా అన్నాడు 'ఆ నిస్సహాయుడైన రాణా ను నేనే స్వమీ' అని.తులసీ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాణా -  అక్బర్ సైన్యం ముందు తన  పరాజయం,  తనవద్ద తగిన సైన్య బలం లేని నిస్సహాయ స్థితిలో అడవులలో ఆకులూ, అలములూ తింటూ గడుపుతున్న ప్రస్తుత స్థితీ-  రాజా మాన్ సింగ్ ఆక్బర్ ఆజ్ఞ తో  తనకొసం తీవ్రంగా అడవులలోనూ గాలిస్తూ ఉండటం,  ఇవన్నీ వివరంగా చెప్పి, కాసేపు ఆగాడు. తులసీదాసుగారి వదనంలోనూ ఆందోళన! రాణా మళ్ళీ మొదలు పెట్టాడు. 'నా రోజులు బాగులేవు. నాకు కాస్త వ్యవధి చిక్కితే మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని ఆక్బర్ పై విజయం సాధిస్తాను.  ఇప్పుడీ మాన్ సింఘ్  నుంచీ నన్ను మీరే కాపాడాలి. అతన్ని నావైపు రాకుండా మీరే చేయాలి' అని విన్నవించుకున్నాడు. తులసీ హామీ ఇచ్చినమీదట అక్కడినుంచీ నిష్క్రమింఛాడు రాణా!
    రాణా  చెప్పినట్టే మాన్ సింగ్ వచ్చాడు. తులసీకి పాదాభివందనం చేశాడు. ఆద్యాత్మిక గురువులను యెవరైనా సరే గౌరవించే అచారం అప్పట్లో ఉండేది. 'నేనిచ్చే కానుకలు స్వీకరించండి. మీ సేవచేసుకునే భాగ్యం కలిగించండి'.అని ప్రార్థించాడు మాన్ సింగ్. తులసీ జవాబిది. 'ధనంతో నాకు పనేముంది నాయనా! నాకో మాటివ్వు. అది చాలు.'  మాన్ సింగ్ అంగీకారంగా తల వూచి, గురువుగారి ఆజ్ఞకై వేచి ఉన్నాడు.   తులసీ గంభీర స్వరం. 'రాణా నా ఆరాధకుడు. అతన్ని ప్రస్తుతానికి వదిలిపెట్టు. ఇది నా ఆజ్ఞ.' మాన్ సింఘ్ మారుమాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. రాణ తరువాత కొద్ది రోజులకు సైనిక బలం చేకూర్చుకుని ఆక్బర్ ను యెదుర్కొన్నాడు.
   ఇటువంటి యెన్నో విషయాలు మా అయ్యగారి రామాయణ ప్రవచనాలలో చిన్నప్పుడు వినేదాన్ని. ఇవే కాక, కాలభైరవొపాసన రహస్యాలు, ప్రత్యంగిరాదేవి, విదేశీయులెందరో మన సంస్కృతిపట్ల ఆకర్షితులైన, ఇప్పటికీ ఆకర్షితులవుతున్న  తీరు- ఇవన్నీ కుర్తాళ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద  భారతీస్వాములవారి ప్రవచనాల్లో వింటూ రోజూ తరిస్తున్నాను. 


పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతిగా,సుప్రసిద్ధ రచయితగా విఖ్యాతులైన వారిగురించి అయ్య మాటల్లోనూ తరచూ వినేదాన్ని. ఇటీవల యేదో విషయంగా  నా వద్ద వున్న అయ్య పుస్తకాలను తిరగేస్తూ వుంటే, ఒక ఇన్ లాండ్ లెటర్ చాలా పాతది దొరికింది. యేమిటబ్బా అని చూస్తే, ఆనందం,  ఆశ్చర్యం- ఒకే సారి ముప్పిరిగొన్నాయి.దాన్ని మీతోనూ పంచుకుందామనిపించి ఇలా......
                                                                                                    25-10-15

Tuesday 29 September 2015

 'మరపురాని మధుర గాధ' 




'మరపురాని మధుర గాధ' 

   విజయనగర సామాజిక, చారిత్రక విశేషాలెన్నో వెలువరించే యీ గ్రంధాన్ని, 
(ఇదివరకు విజయనగర సామాజిక చరిత్ర అన్న పేరుతో 45 సంవత్సరాల క్రితం ముద్రింపబడి చాల సంవత్సరాలుగా మరుగున పడిఉన్న గ్రంధమిది) '70 ప్రాంతాలలో యెన్ని  సార్లు చదివి ఆ  లోకంలోనే విహరించి ఉంటానో గుర్తే లేదు.2009 లో దీన్ని విజయనగర సామ్రాజ్య కాలంలోనీ మరికొందరు సుప్రసిద్ధూలూ, సిద్ధులూ గురించి అయ్య ఆంధ్ర ప్రభలో వ్రాసిన లఘు వ్యాసాలతో కలిపి 'మరపురాని మధుర గాధ' గా ముద్రించాను. ఈ గ్రంధం గురించి లక్ష్మీదేవిగారి సహృదయ  స్పందన చూసి ఆనందం పట్టలేక పోతున్నా! నేను చేస్తున్న పని ఇలా జ్ఞానకాంక్ష ఉన్న పదుగురి దాహాన్ని తీరుస్తున్నదంటే ఆనందం! మహదానందం!  ఈ సందర్భంగా అయ్య అలభ్య గ్రంధాలనిలా పునర్ముద్రించటం వెనుక, నా ఆరాధనా, తపనా కూడా  మిత్రులతో పంచుకుందామనిపిస్తున్నది.  1996 లో నేను మా అయ్యగారి అలభ్య గ్రంధాలనూ,అసంకలిత వ్యాసాలనూ (సంకలనాలుగా) ముద్రించటం మొదలు పెట్టిన తొలి రోజుల్లో 'మహభారత విమర్శనం' (దీన్ని కూడా  తెలుగు యెమ్మే చేసేటపుడు చదివి, అయ్య పట్ల ఆరాధన హిమాలయమంత పెరిగిపోయింది.) ముద్రించి, మా అయ్య పాదాల దగ్గర పెట్టి, నా జన్మ ధన్యమయిందని అనంద బాష్పాలతో విన్నవించుకున్నాను. అటు తరువాత,నా తపన, నన్ను విశ్రాంతి తీసుకోనివ్వలేదసలు.. 'ప్రాకృత వ్యాస మంజరి'(అయ్యగారి  అసంకలిత ప్రచురిత వ్యాసాలు) 'వ్యాస వల్మీకం' (అయ్యగారి, దాక్షిణాత్య  సాహిత్య వ్యాసాలు)'సరస్వతీపుత్రునితో సంభాషణలు' (వివిధ పత్రికలలో వచ్చిన అయ్యగారితో ముఖాముఖి-పరిచయాలు)  'శివకర్ణామృతం' (అయ్య సంస్కృత రచన అర్థంతో సహా+శివతాండవ సహితంగా - యీ సంస్కృత కావ్యం ప్రచురణ వెనుక పెద్ద కథే ఉంది),'పెనుగొండలక్ష్మి', 'మరపురాని మధుర గాధ' (విజయనగర సామాజిక చరిత్ర+విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన ఇతర వ్యాసాలు)   అ తరువాత,ఇటీవల 'త్రిపుటి' (అయ్య అపురూప వ్యాసాలు+పుస్తక సమీక్షలు+పద్య వ్యాఖ్యలు+కామకోటి పత్రికకు వ్రాసిన సంపాదకీయాలు) ఇవన్నీ చేస్తున్న సమయాల, నా నరనరాల్లోనూ, అయ్య నామస్మరణే!   ఒక్కొక్క గ్రంధం ప్రచురిస్తున్నప్పుడూ,ఇటీవలే శివైక్యం చెందిన  శ్రీ రామవజ్ఝల శ్రీశైలం గారి సహకరం మరువలేనిది. అయ్య అసంకలిత వ్యాసాలు వారు ఇచ్చినప్పుడల్లా, వాటిని ఒక శీర్షిక క్రింద యెలా ప్రచురించాలి, పుస్తకం పేరేమి పెట్టాలి,ముఖచిత్రం యెలా ఉండాలి...వీటన్నిటి గురించీ ఆలోచిస్తూ,  నిద్రలేని రాత్రులెన్నెన్నో!   నా పనులన్నిటిలోనూ అడ్డుపెట్టక సహకరించిన నా కుటుంబ సభ్యులందరికీ, ఆ గ్రంధాలన్నిటినీ కొని చదివి పుట్టపర్తివారి  సాహితీ త్రివిక్రమత్వాన్ని అనుభూతించిన అయ్య అభిమానులకూ ధన్యవాదాలు.   ('త్రిపుటి'  ' 'పెనుగొండలక్ష్మి'  'శివతాండవము' (బాపూగారి చిత్రాలతో సహా)  ప్రతులు శివతాండవం ఆడియో సీ.డీ.    నవోదయ -ఆర్యసమాజ్ దగ్గర, కాచిగూడ క్రాస్ రోడ్స్   వద్ద  లభ్యములు)..    ప్రియ మిత్రులకు విన్నపం.ఈ గ్రంధాల ప్రచురణ ఒక పద్మవ్యూహం వంటిది. చేయి తిరిగిన ప్రచురణకర్తలకు తప్ప యీ రంగంలో సామాన్యులైన మా అయ్యగారివంటి సమ్మాన్యులకు కూడా అపజయాలే చవిచూడవలసి వచ్చేది. నావంటి అర్భకురాలి సంగతి చెప్పేందుకేముంది? ఐనా, అయ్య సేవలో లాభనష్టాల గురించి ఆలోచించి అడుగు వెనకేయటం నాకస్సలు నచ్చలేదు. అందుకే ప్రచురణరంగంలో అభిమన్యుని ఆరాధకురాలిగా అడుగు పెట్టాను. ఈ   అమ్మకాలవల్ల వచ్చే డబ్బుతో అయ్య మరో గ్రంధం వెలుగులోకి వస్తుందన్న నమ్మకమే నన్ను  ముందుకు నడిపిస్తున్నది..        

Thursday 24 September 2015

    ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలోనూ, అటు మక్కా లోనూ జరిగిన ప్రమాదాల గురించి రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్న నేపథ్యంలో..  






      
      తప్పు యెక్కడ యే మతంలో యే ప్రాంతంలో   జరిగినా,  యెవరైనా 
దాన్ని సరైన కోణంలో చూడటం, వాస్తవాలను మాట్లాడగల్గటమే సరైన పద్ధతి. భగవంతుణ్ణయినా నిలదీయగలగటమే నిజమైన బాధ్యతగల్గిన పౌరుని (కళాకారులందరితో సహా) కనీస కర్తవ్యం.                    
        1967 ఆగష్ట్ 15, కామకోటి (కామకోటి పీఠ ప్రచురణ) సంపాదకీయంలో 
మా అయ్యగారు:
        ' ఈ నడుమ తిరుమలలో శ్రీనివాసుని ఆలయ ప్రాంగణమందే 
పంధొమ్మిది మంది మరణించినారు. కారణము-జనుల త్రొక్కిడి. క్యూ లో నిలిచికొన్న జనులకు అధికారులు  కల్పించిన అనుకూలముల వైభవము. ...ఈ దురాగతము పైన ఒక ట్రస్టీ బోర్డ్ సభ్యుడు చేసిన విచిత్ర వ్యాఖ్యానమొకటి ఉన్నది. అది మనందరమూ తెలిసికొనదగినది. 'పవిత్రమైన పుణ్య క్షేత్రములో ఇటువంటి సంఘటన జరగటమంటే,  స్వామికి యెక్కడైనా, యేదైనా అపరాధము యాత్రికుల వల్ల కానీ, పరిచారకుల వల్లకానీ, జరిగిందేమోనని అనుమానము కలదు.' ఓహోహో! తమ రాజకీయముల వాసన వెంకటేశ్వరుని  నామములకు కూడానంటించినారు. వారికి పై పద్ధతి యలవాటు. పాపమేమి సేతురు? ఒకడు తప్పు చేసిన, వాడు దిక్కులేనివాడైనచో, వాని బలగమునంతటినీ, మారణహోమమొనర్చెడు చిత్తవృత్తి రాజ్జకీయములందే! ఒక వేళ భగవంతుడు, వీరనుకొనునట్టివాడేయైనచో, అపరాధిని గుర్తించలేనట్టి గుడ్డివాడా  వెంకటేశ్వరుడు?
 ..శ్రీహరి సూక్తి 'యెక్కడో తన్నిన యెక్కడో యేమో జరిగినట్లున్నది.ఓహో స్వామి! నీవు దయామయుండవని మా విశ్వాసము. అన్నమయ్య నిన్ను
 'దయ కరుడుగట్టిన మూర్తి'గా వర్ణించెను. అట్టి నీవు, రాజకీయ వాదుల సూక్తులలో యెన్ని వేషములు వేయుచున్నావు? నీ దర్శనమునకై వచ్చిన జనముల్ను తొక్కుకొని  నిన్ను జూడ వచ్చిన 'మనుష్యు ' లకు దర్శనమిచ్చినావా? నిజమా? ఇవ్వవలసినట్టిచ్చినావా? అయినచో నీకన్నను దయ్యమే మేలు.'

(త్రిపుటి-పుట్టపర్తి నారాయణాచార్యులవారి అపురూప పీఠికలు, వ్యాఖ్యలు, వ్యాస సంకలనం నుంచి - 2012 లో ప్రచురితం)  
                                  .........................                     

Monday 14 September 2015

punnaga : విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి ...

punnaga :
విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి ...
: విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి కొన్ని అంశాలు)  ఆధునిక రామకావ్యాలలో విశ్వనాథ వారి కల్పవృక్షం, ఒక కమనీయ రమణీయ శిల్ప వృక...

Sunday 13 September 2015

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...:  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్తున్న పుట్టపర్తివారి గురించిన వివరణ ఇది.అయ్యతో అనేక సంవత్సరాల అనుబంధం ఉన్న కామిశెట్టివార...

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...:  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్తున్న పుట్టపర్తివారి గురించిన వివరణ ఇది.అయ్యతో అనేక సంవత్సరాల అనుబంధం ఉన్న కామిశెట్టివార...

Thursday 23 July 2015

 తెలుగు సాహితీసమితి న్యూ జెర్సీ ఇటీవలే ముఫై సంవత్సరాల సుదీర్ఘ సఫల యాత్ర విజయోత్సవాలను కన్నుల పండుగగా చేసుకుంది.  ఉదయం తొమ్మిది గంటలనుండీ రాత్రి  పదకొండు గంటల వరకూ ఆసాంతమూ ఆసక్తికరంగా, నయనానందకరంగానూ, శృతి సుభగంగా, ఉత్తేజవంతంగానూ కొనసాగిన    సాహిత్య సంగీత నాట్య విభావరి వేల రసజ్ఞుల మనసులను దోచుకుంది.ఇక్కడి బాల బాలికల నాట్య, సంగీతాభినివేశాలు నిజంగా ప్రశంసాపాత్రాలు.  వారి తల్లిదండ్రుల శ్రద్ధాసక్తులు నిజంగా కొనియాడదగినవి. తెలుగునాడు వలెనే  అలాంటి కౌశలం ఇక్కడ అమెరికాలోనూ వెల్లివిరియటం అద్భుతమే! ఈ సందర్భంగా తెలుగు సాహితీసమితివారు ప్రతిభ అన్న పేరుతో ఒక ప్రత్యేక సంచికను వెలువరించారు. డాక్టర్.వైదేహీశశిధర్ గారు యీ సంచిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి,బహు చక్కని సంచికని తీసుకువచ్చారు. అందులో నా  రచనకూ స్థానం దక్కటం నా అదృస్థంగా భావిష్తున్నాను.తెలుగు సాహితీసమితి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో ఆ వ్యాసాన్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.



                ..............  
                               'గాధాసప్తశతి' లో గ్రామజీవనం                    
                                                                                                    డా.పుట్టపర్తి నాగపద్మిని                     
        ఇటీవల ఒక ఫోటో చూశాను. పాతకాలం బాటసారులకోసంలో నిర్మించిన సత్రాలూ, బావులూ, ఇంకా అక్కడక్కడా అవశేషాల్లా ఉన్న ఊర్లు! మా చిన్న తనంలోనూ ఇలాంటి సత్రాలు ఊరి బయట ఒకటి రెండు కనిపించేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా  మారిపోయింది.  ఊళ్ళలో అన్నీ నక్షత్ర కాంతుల లాడ్జీలే కనిపిస్తాయి. చిన్న చిన్న ఊళ్ళలోనూ చిన్నో చితకో లాడ్జీలే ఉంటాయి తప్ప,ఉచితంగా బాటసారుల సేద తీర్చే సత్రాలు కనిపించనే కనిపించవు.
        ఆ ఫోటోలు చూస్తుంటే, గాధాసప్తశతి లోని అచ్చమైన పల్లె వాతావరణం, బాటసారులను గ్రామస్తులు ఆదరించే పద్ధతీ, వారి ముచ్చటగొలిపే సంప్రదాయాలూ, వారి నమ్మకాలూ ఇవన్నీ గుర్తొచ్చి, కళ్ళు చెమరించాయి.
       మా అయ్యగారు పుట్టపర్తివారి వద్ద మూదువందల గాధల దాకా నాకు  పాఠం  అయ్యింది-1973-1974 ప్రాంతాలలో! వారి దగ్గర  పాఠం   అంటె, కత్తి మీద సామే! నిన్న చెప్పిన  పాఠం  యీరొజు అప్పజెప్పి తీరాల్సిందే!యేమాత్రం తేడా వచ్చినా తిట్లు తప్పవు. అయ్య కోపాన్ని తట్టుకోవటం చాలా కష్టం. ఏదో పడుతూ లేస్తూ, కొన్ని గాధలు పూర్తి చేసుకోగలిగాను కానీ, ఆగిపోయినతరువాత తెలిసింది- ఎంతగా నష్టపోయానో!ఏదో నేనాతరువాత, మరికొన్ని చదివినా, అప్పటి అనుభవం ముందు, ఇవన్నీ దిగదుడుపే! 
 మా  అయ్యగారు చూపిన మార్గంలోనే నడుస్తూ,వారు చెప్పిన, నేను గమనించిన నాటి గ్రామ జీవితం గురించి కొన్ని సంగతులివిగో మీకోసం! 
   అసలు, గాధాసప్తశతి మొత్తం అమూల్య మౌక్తిక రాసి. ముక్తకాలంటే, వేటికవే సంపూర్ణార్థం కలిగి, చదువరులను ఆహ్లాదపరచే రసగుళికలు. భామహుని దృస్టిలో అనిబద్ధ కావ్యం ముక్తకం.   అగ్నిపురాణకారుని  దృస్థిలో        
 'చమత్కార సృస్థిలో సామర్థ్యం ఉన్న శ్లోకమే ముక్తకం. లోచనకారుడంటాడూ- 'పూర్వాపర నిరపేక్షణాపియేన రసచర్వణా  క్రియతే తదేవ ముక్తకం' అని! మొత్తానికి, వ్యంజనతోపాటూ, రస సృస్ఠీలోనూ సామర్థ్యం గల ముక్తకాన్ని, సరస ముక్తకమనీ, కల్పనతోపాటూ, నీతినీ గంభీరంగా ప్రతిపాదించే ముక్తకాన్ని సూక్తి అనీ అంటారు. చమత్కారం కూడా లేని ముక్తకాన్ని వస్తు కథన ముక్తకం అంటారు. గాధాసప్తశతిలో ఇవన్నీ ఉన్నాయనె చెప్పాలి.
 దా.జాన్ డ్రింగ్వాటర్ దృష్టిలో, మనిషి లోని మానసిక శక్తి నాలుగు విధాలు. 1. పూర్ణనియంత్రణాత్మిక బౌద్ధిక దృష్టి (Profound Intellectual controll of mateirial) 2. పూర్ణ భావాత్మక చేతన (Profound emotionsal Sensitiveness to mateirial) 3. నైతికత (Energy of Morality) 4. కవిత్వ శక్తి. (Petic energy)
వీటిలో, మొదటి రెండింటినీ, సంఘటిత శక్తి, సహృదయత అనే అనవచ్చు. మూడవది మనకు తెలిసినదే! నాలుగవదైన కవిత్వ శక్తిని, అన్నింటిలోనూ శ్రేష్తమైనదంటారాయన! (Poetic energy is the witness of the highest urgency of individual life, of all things, the most admirable and great.)                   
        ఈ నేపధ్యంలో, గాధల్లో నాటి  గ్రామీణ వాతావరణం ప్రతిఫలించే  కొన్ని ముక్తకాలలోని  మధురిమలను ఆస్వాదిద్దాం. 
 ఇక్కడొమాట చెప్పుకోవాలి. గాధాసప్తశతి నిండా శృంగారమే చిప్పిల్లుతూ ఉంటుందనీ, మరి ఇతర వ్యక్తీకరణలే ఉండవనీ ఒక అభిప్రాయం ఉంది. ఆమాటకొస్తే, మన జానపద సాహిత్యంలో శృంగారానికే పెద్ద పీట కదా! కానీ, వానిలోని  భాష అందరికీ అర్థమయ్యేది కాబట్టీ, కాస్త అందుబాటులో  ఉంది కాబట్టీ, జానపద సాహిత్యాన్ని మరింతగా వెలికి తీసి, అందులో ఉన్న ఇతర విషయకాలైన గేయాలను విశ్లేషించి, జానపద సాహిత్య హృదయాన్ని శ్లాఘిస్తున్నారు. కానీ, హాలుడు తనకిస్తమైన అప్పటి కొన్ని గాధలను మాత్రమే  సమీకరించాదు. ప్రాకృత సమాజాన్ని అధ్యయనం చేయటానికి,  అవే మనకు ఇప్పటికి  దారి దివ్వెలు. అంతమాత్రం చేత, ఆనాటి సమాజాన్ని విశృంఖల శృంగార భరితం అనటం సబబు కాదేమోననిపిస్తుంది.  ఉన్నంతలో, వాటిని విశ్లేషిస్తే, ఒక విషయం బోధపడుతుంది. గాధాసప్తశతి లోని శృంగార గాధలన్నీ మేలిమి ముత్యాల రాసులు. మధ్యలో వెలుగులు విరజిమ్ముతూ, మనల్ని ఆకర్షించే మేలు జాతి మరకత మణులూ, పచ్చలూ- అందులోని గ్రామీణ జీవన చిత్రణలు.
     ఇప్పుడిక అసలు విషయంలొ ప్రవేశిద్దమా!      
     ఊరి ముందు ఒక పెద్ద మర్రిమాను, దాని చుట్టూ అరుగూ కూడా  ఉంటే, బాటసారులకు ఎంత అనుకూలంగా ఉంటుంది కదా! గాధాకారుడదే అంటున్నాడు. 
           సుఅణో జం దేస మలంకరేఇ తం విఅ కరేఇ పవసంతో, 
           గామాసణ్ణుమ్మూలిఅ మహావడట్టాణ సారిచ్చం. (1-94) 
 వటవృక్షం, ఊరిపొలిమేరలో ఉంటే, ఊళ్ళో సత్పురుషుడు ఉన్నట్టే! అంతా సంతోషంగా, శ్రీరామ  రక్షగా ఉంటుంది.అదే ఆ సత్పురుషుడు పోతే, ఊరంతా పాడైపోయినట్టే! మర్రిచెట్టు కూలిపోయినా, ఊరిపొలిమేరంతా బిక్కు బిక్కుమన్నట్టు ఉంటుంది.  మర్రిచెట్టును సత్పురుషునితో పోల్చటం గాధాకారుని గొప్పదనం కాదూ! 
మర్రిచెట్టునుదాటి కాస్త ఊరిలోకి వెళ్తే, అక్కడొక కుండలకపిల కనిపించింది గాధాకారునికి! దాహం వెసింది.మంచినీళ్ళు తాగాలనిపించింది. కుండలతో నీళ్ళు చేదుకునే సమయంలోనూ,ఒక సంగతి గుర్తొచ్చిందతనికి!కుండల కపిలను చూస్తే  దుష్టులు   గుర్తొచ్చారట పాపం! ఎలా? ఖాళీగా ఉన్నపుడు, తేలికగా, ముఖం వేళ్ళడేసుకుని ఉండే కపిలలు, బావిలోకి వెళ్ళి నీళ్ళతో నిండి, బయటికి వచ్చేటప్పుదు, నీల్గుకుంటూ, గొప్పగా గర్వంగా బయటికి వస్తాయట! దుష్టులూ అంతే! తమ అవసరం వచ్చినప్పుడు, వినయంగా వెళ్తారు. పని ముగిసిన తరువాత, పెడమొగం పెడతారు.ఆ గాధ ఇదీ! 

              ఉఅఅం  లహిఉణ  ఉత్తాణిఆఅణా  హోంతి కే  వి  సవిసేసం 
              రిత్తా ణమంతి  సుఇరం  రహట్ఠ  ఘడిఅ  వ్వ  కాపురిసా..(5-90) 
        నీళ్ళు తాగి కాస్త సేదదీరి, ఊళ్ళోకి అడుగులు వేశామోలేదో, మళ్ళీ, నోరెండుకు పోతోంది.ఏమి యెండలండీ బాబూ! యెండలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ఇదిగో ఇలా! 
           థో అం పిణ ణీసరయీ మజ్ఝణ్ణే ఉహ సరీరతలలుక్కా 
           ఆఆవభఏణ చాఈ వి పహిఆ తా కిం ణ వీసమసి (1-49) 
    'అబ్బబ్బా! ఈ ఎండ ఎంత తీవ్రంగా ఉందంటే, చెట్టు నీడ కూడా భయపడి చెట్టుకిందే దాక్కుంది .'చూశారా!  ఆహా! గాధాకారుని అత్యుక్తి అమోఘంగా లేదూ? సాధారణంగా మట్టమధ్యాహ్నం ఎండ, చెట్టు కిందే పడుతుంది.ఆ  వాస్తవాన్ని, యీ ముక్తకంలో ఎంత బాగా వ్యక్తీకరించాదో! నీడకు భయాన్ని ఆపాదిస్తూ 'చెట్టుకిందే తలదాచుకుంది పాపం' అనటంలోనే ఉంది ప్రజ్ఞంతా!
 అదిగదిగో! అక్కడొక చలివేంద్రం ఉన్నట్టుందండోయ్! బాగానే గుంపు కనిపిస్త్తున్నది..అమ్మయ్య.. దగ్గరికొచ్చేశాం. అరెరే! బాటసారుల దోసిళ్ళలో చెంబుతో   నీళ్ళు పోస్తున్న అందగత్తెను చూస్తుంటే మతి పోతోందే! యేమందం, యేమందం! 
        ఉద్ధచ్చో పిఅయి జలం జహజహ విరలంగలీ చిరం పహిఓ 
        పావాలిఆ వి తహతహ ధారం తణుయిం పి తణుయేయి. (2-61)
    ఆ చిన్నది బహు వయ్యారంగా నీళ్ళు పోస్తుంటే, అదిగో, ఆ యువకుడు దోసిలితో పట్టి  తాగుతున్నాడు అ అందగత్తెను తదేకంగా చూస్తూ! అరెరే! ఎంతకీ దోసిలి నిండదేమిటి? పైగా నీళ్ళన్నీ ఓవైపు కారిపోతున్నాయి కూడా! తలెత్తి ఆ చిన్నదాని అందం తాగుతున్నాడా అన్నట్టుగా ఉంది తప్ప, దాహం తీర్చుకుంటున్నట్టే లేదు. ఆ వయ్యారి కూడా తక్కువేమీ తినలేదు లెండి. నీళ్ళధార బాగా తగ్గించి మరీ పోస్తున్నది ఆ యువకుని దోసిలిలో! ఇద్దరికిద్దరే! అందుకే కాబోలు, ఇక్కడింతమంది గుమిగూడారు! వీళ్ళ కథ ఇప్పుడప్పుడే ముగిసేట్టులేదులెండి. మరేదో ఒక మార్గం చూసుకోవాలిక! 
 అదిగదిగో! అక్కడేదొ మంచినీటిచెరువు  ఉన్నట్టే ఉంది..పక్షులు ఎగురుతున్నాయక్కడ!హమ్మయ్య! చూశారా!వచ్చేశాం.. ఎంత నిశ్శబ్దంగా ఉందిక్కడ! అరెరే! చెరువు ఎంత నిశ్చలంగా ఎవరొ ఆకాశాన్ని నీళ్ళల్లో పదిలంగా తల్లక్రిందులుగా పెట్టినట్టే లోపల ప్రతిబింబిస్తూ  ఉందే! అదిగో! ఆ..నెమ్మదిగా అడుగులు వేద్దాం..చూశారా! అంత పెద్ద ఆకాశం మీద పడినా ఒక్క కమలమూ నలగ లేదు. ఒక్క హంసా యెగిరి పోలేదు..  
             కమల అరాణ మలిఆ హంసా ఉడ్డావిఆ ణ అ పిఉచ్చ్హా 
             కేణావి గామ తడాయే అంభం ఉత్తాణఅం వ్వూఢం (2-10) 
 అదిగదిగో! ఇంకో చిత్రమూ చూడండి.. 
            ఉఅ ణిచ్చల ణిప్పందా భిసణి పత్తమ్మి రేహయి బలాఆ 
            ణిమ్మఅ మరగఅ భాఅణ పరిట్ఠిఆ సంఖ సుత్తివ్వ (1-4)
     అదిగో, అదేమిటీ? మేలు జాతి మరకత మణులు తాపించిన పాత్రలో, చందనమదీ ఉంచేందుకు పెట్టిన శంఖ నిర్మితమైన   భరిణె లా అందంగా కనిపి స్తున్నదేమిటబ్బా? అరెరే! శంఖం కాదండీ.. విచ్చిన తామరల మధ్య నిశ్చలంగా కూర్చుని వున్న కొంగ సుమా! యేమాశ్చర్యం! అంటే.. చాలాసేపటినుంచీ ఇక్కడికెవరూ రానేలేదన్నమాట! భలె బాగుందికదూ..ఇది ఇక్కడి ప్రేయసీప్రియులకు చక్కటి సమాగమ ప్రదేశంలా ఉంది. ఎవరూ రారు అంతగా మరి..మనమేదో బాటసారులం.నీళ్ళు వెదుక్కుంటూ వచ్చామంతే కానీ ఊళ్ళో వాళ్ళకి ఇక్కడేంపనీ? పదండి..మనమూ నీళ్ళు తాగి మన దారిన మనం పోవాలి.. "
           బాటసారుల అనుభవాలెలా ఉండెవో మచ్చుకు కొన్ని ఇవన్నమాట!  అప్పటి గ్రామాల్లొ, వరి చేలు బాగా ఉండేవి.(4/30, 7/91) చెరుకు పంట  గురించే కాక చెరుకు తీయటాన్ని కూడా వర్ణీంచారు గాధాకారులు. ఇంకా జొన్నలూ,రాగీ,  పత్తి, నువ్వులూ, కాకరా, దోస మొదలైన పంటల గురించిన ముక్తకాలూ కనిపిస్తాయి.పత్తిని ఆడా మగా కలిసి యేరేవారటకూడా! (2/77)  మామిడి తోపులు పల్లెల్లో బాగానే ఉండేవట!(1/62,2/43)మామిడి తోపులలో ప్రేయసీప్రియులు కలుసుకోవటం గురించి యెక్కువగానే వర్ణనలున్నాయి.అంతే కాదు.మామిడి తోరణాలతో  ఇంటి ని అలంకరిచటమూ ఉండేది. 
                   సా తుహ కయేణ బాలా అ అణిసం ఘరదార తోరణ అణిసణ్ణా 
                  ఓససయీ వందణ మాలి అ వ్వ ది అ హం వి అ వరాయీ (3/62)
    దూతిక ఒక యువకునితో అంటున్నది-'ఆ అమాయకురాలు, మమిడి తోరణంలా నీకోసం, పవలూ రేయీ పడిగాపులు కాస్తూ అలాగే వేచి ఉంది. కాస్త కనికరించు.'  ' పవలూ, రేయీ' అంటే, నిరంతరమూ అలా నిలుచునే ఉంటుందన్నమాట ఆగంతకుడైనవారి కోసం!  మామిడి తోరణం ఎప్పుడూ యెదురు చూస్తున్నట్టుగానే,ఆ అమ్మాయీ ఎదురుచూస్తూ, వాడిపోతోందని అర్థం. అంటే, హాలుని కాలంలో మమిడితోరణాలు ఇంటిగుమ్మాలకు కట్టే ఆచారం ఉండేదని స్పస్తంగా తెలుస్తున్నది. ఇంకా ఇలాంటి ఎన్నో ఆచారాల గురించి, గాధల రూపంలోనే హృద్యంగా వర్ణించారు కవులీ గాధల్లో!                          
                     ఇంకా నేరేడు (2/80) బిల్వం (9/19) కూడా పెంచేవాళ్ళు మాలతి(1/92),వకుళ(1/63),కుంద(5/26),కదంబ(1/37),శిరీష(1/55),పారిజాత(5/12)వృక్షాలను ఇళ్ళల్లోపెంచుకునేవారట కూడా! గ్రామాలకు దగ్గరగా ఉన్న అడవుల్లో, వేప(1/30)వట(1/7మొదలైన వృక్షాలు ఉండేవట! ఇంత చక్కటి వాతావరణంతో అలరారుతున్న పల్లెపట్టుల్లో ఆనాటి ప్రజలు ఎంత నెమ్మదిగా, ఆనందంగా జీవనం సాగించేవారోకదా, అనిపించదూ మనకు? నేడు నగరాలకూ, పల్లెపట్టులకూ, పెద్దగా తేడ ఉండటమేలేదనిపిస్తున్నది. ఎటుచూసినా, కాంక్రీటు అడవులే కదా దర్శనమిస్తున్నాయి మనకు! పల్లెటూళ్ళలోనూ వేగ నాగరికత చాయలు కనిపిస్తూనే ఉన్నాయి కదా మరి! 
    గాధాసప్తశతి లోని స్త్రీలు మనలా శిరోజాలంకరణకు, మల్లెలు, జాజిపూలూ, కనకాంబరాలు వాడేలా కాక, నేరేడు చివుళ్ళు కూడ వాడేవారట! (2/80) మగవాళ్ళు కూడా కర్ణావతంసాలు పెట్టుకునేవారట!మామిడి పూగుత్తులు (4/31) పాద్రి పూలూ కూడా ధరించేవారని కొన్ని గాధల్లో ఉంది. (5/69) 
    బాటసారులకు ఇళ్ళబయట పడుకునేందుకు అనుమతించటంతోపాటూ, తలకిందికి గడ్డిమోపుకూడా సరఫరా చేసేవాళ్ళట! (4/79) బాగుంది కదూ! 
 సరే! పడుకునేందుకు ముందు బాటసారులకు కాస్త ఉబుసుపోక కబుర్లు కూడా కావాలి కదా మరి! ఒకతనన్నాడూ.క్రితంసారి తాను ప్రవాసానికి వెళ్ళినప్పుడేమైందంటే, తాను ఊరి చెరువులో స్నానానికి వెళ్ళాడట! తీరా వెళ్ళేసరికి,  అక్కడ, ఆడవాళ్ళు కూడా, జలకాలాడుతున్నారు. తానూ నీళ్ళలో దిగాడు. ఇంతలో ఏమైంది?
            పిసుణేంతి కామినీణం,జలలుక్క పిఆవ ఊహణ సుహేల్లిం
            కణ్డఇఅ కవోలుత్ఫుల్ల ణిచ్చలచ్చీయిం వఅణాఇం.(6/58)
 యెవరో తన కాళ్ళు లాగుతున్నారట! చచ్చే భయం  వేసింది. కొంపదీసి మొసలి కాదుకదా? భయపడి గట్టిగా  అరిచేసరికి, చుట్టుపక్కల వాళ్ళు, నీళ్ళలోకి వంగి విడిపిస్తుంటే యేమైంది? ఎవరో యువకుడు, తన ప్రియురాలనుకుని, తనకాళ్ళు పట్టి లాగాడన్న మాట! అందరూ ఒకటే నవ్వులు! 
  అతని మాటలు విని తక్కిన ఇద్దరూ కూడా కిసుక్కున నవ్వారు. మరిప్పుడు రెండవ బాటసారి తన అనుభవం ఇలా చెప్పాడు. అది చలి కాలం. ఒక  వూరిలోని దేవాలయం దగ్గర మునగదీసుకుని పడుకున్నాడు. చలి పడుకోనీయటమే లేదు. అక్కడా ఇక్కడా గడ్డీ, గాదమూ  యేరుకొచ్చి, నెగడు వేసుకున్నాడు.  అవి ఒకసారే అంటుకుంటాయా మరి?  ఒక పట్టాన రాజుకోవటమే లేదు.ఊది, ఊదీ,తన బట్టలూ పిడకల కంపు కొడుతున్నాయి. అంతేనా! ఒకటే పొగ! పిడకలూ, గడ్డీ ఎగదోస్తూ కూర్చున్నాడు రాత్రంతా! నెగడును కర్రతో కెలుకుతూ ఉంటే, లోపల యెర్రగా కనిపిస్తుంది. ఆరిపోతే  నల్లగా పెద్ద రాసి. యెలుగు బంటిలాగే  ఉందట ఆ రాశి! నెగడును కుళ్ళబొడుస్తుంటే, ఆ  యెలుగు బంటి పొట్ట  చీలుస్తున్నాట్టే  అనిపించిందట తనకు! అలా, రాత్రంతా ఒంటరిగా గడిపానని చెప్పుకొచ్చాడతగాడు! తక్కిన ఇద్దరూ  జాలి పడ్డారు అతగానిపై!  ఆ గాధ ఇదీ..
                  ఫాలేయి అఛ్ఛ భల్లం వ ఉఅహ కుగ్గామ దేవుల ద్దారే 
                  హేమంత ఆల పహిఓ విఝ్ఝాఅంతం పలాలగ్గిం. (2/9) 
  ఇప్పుడిక మూడవ బాటసారి అందుకున్నాడు. క్రితం సారి తానొక ఇంటిముందు ఇలాగే పడుకున్నాడు.రాత్రి బాగా పొద్దు పోయింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.ఒక్కసారిగా  ఇంట్లోంచీ ఒకటే యేడుపులూ పెడ బొబ్బలూ! ఇంటి  ఇల్లాలు ప్రసవ వేదన పడుతున్నట్టుంది.   చాలా మంది ఆడవాళ్ళు  ఆమెను సముదాయిస్తున్నారు. కాస్త వేడి నీళ్ళు    తాగించండి అని ఎవరో అంటే, 'యేమీ వద్దు అంటూంది ఆమె. 'అసలేమీ వద్దంటే ఎలాగే తల్లీ' అన్నారెవరో! 'అమ్మ నాయనో! ఓరిదేవుడో! ఇంత కష్ట పడాలా పిల్లల్ని కనాలంటే? మొగుడూ వద్దూ, మొద్దులూ వద్దు. నాకు పిల్లలొద్దురో దేవుడా!' అని ఆ గృహిణి ఒహటే ఏడుపు! 'దీన్నే అంటారు ప్రసూతి వైరాగ్యమనీ!' అంటూ భళ్ళున నవ్వేస్తున్నారట  చుట్టూ చేరిన ఆడాళ్ళు!బయట పడుకున్న తనకీ పట్టరానంత నవ్వు వచ్చిందట! ప్రపంచంలో కాపురాలన్నీ ఇలాగే సాగుతుంటాయి మరి! (2/26)
         మన నిత్య జివితంలో పాదుకుని పోయి వున్న  కొన్ని నమ్మకాలకు అచారాలకు మూలాలు,   కొన్ని గాధలలో  కనిపించటం మనల్ని  ముగ్ధులను గావిస్తుంది. పొలం పనులు మొదలు పెట్టేటప్పుడు,  మడకపై   శుభ సంకేతంగా స్వస్తిక గుర్తునుంచటం (2/61)   బంగారు 'శ్యామ శబల వ్రతం' చేయటం వల్లే,  అందమైన ఆడవారి ఆభూషణంగా మారి, వారి అందమైన శరీరాలను అంటిపెట్టుకునే  భాగ్యాన్ని పొందిందనటం (3/11)   కోపకారణంగా  పగలంతా భర్త తో మాట్లాడకపోయినా,   రాత్రి,  అతని పాదల వద్దే భార్య పడుకుందనటం (7/27)  ప్రియునికి లేఖ వ్రాస్తూ,  ముందుగా 'స్వస్తిశ్రీ ' అన్న కుశల సూచక  పదాన్ని వ్రాసిందనటం (3/44) ఇలాంటి  వర్ణనలతో, గాధా సప్త శతి - 'ఇది మన జీవితాల దర్పణమే' ననిపిస్తుంది.  ఇంక, శకునాలు, పెళ్ళి సంబరాలు, పెళ్ళి పాటలు, సూర్య నమస్కరాలు, సంధ్యా వందనాలు,గుప్త నిధులు, సతీ సహగమనాలతొపాతూ, ఎలుగుబబ్త్లు,నెమళ్ళు, జింకలు, సాలెపురుగులు,బర్రెలు మనలను తమతో నడిపిస్తాయి.   ఇంద్రధనుస్సులు మనల్ని మురిపిస్తాయి.  క్రీస్తు శకం 6-7 సంవత్సరాల మధ్యవాడైన  హాల చక్రవర్తి సంకలనం చేసిన మహారాష్ట్రీప్రాకృతం   లోని యీ గాధాసప్తశతిలో, గోదావరి, నర్మద, రేవా నదుల ప్రసక్తితోపాటూ,కొందరు తెలుగు కవుల గాధలూ, అత్తా(అత్త) అద్దాయే(అద్దం) తుప్ప(నేయి) రంప(రంపపుపొట్టు) మయిల (మైల) చోజ్జం(చోద్యం) వంటి తెలుగు పదాలు ఉండటం వల్ల, తెలుగు భాష ప్రాచీనతకు ప్రామాణికత చేకూరిన తృప్తీ దక్కుతుంది.
        ఇన్ని విశేషాలున్న  గాధాసప్తశతికి, కేవలం శృంగార శతకంగానే ముద్ర వేయటం, అంత భావ్యం కాదేమోననిపిస్తుంది. పైగా, ఇప్పుడు, మనల్ని మళ్ళీ పల్లెలవైపు నడిపించే శక్తి కూడా యీ గాధలకు ఉందంటే అది అతిశయోక్తి కాదేమోకూడా!                                  డా.పుట్టపర్తి నాగపద్మిని     
                                                   .......................  
       


Wednesday 1 July 2015

                            పండిన వృధాప్యంలో,కూతుర్ల పెళ్ళిళ్ళన్ని ఐపోయి, ఒంటరిగా,(మా

 అమ్మగారు గతించారు) అలా కడపలో, మా ఇంటి అరుగుపై 

కూర్చుని,ఉండేవారు మా అయ్యగారు! హడావిడిగా (ఒక రకంగా కొంపలు

 మునిగిపోతున్నాయేమోనన్నాట్టు-మా అయ్యగారి మాటల్లోనే) ఉదయం 

నుంచీ పరుగులు పెడుతున్న జనాలను నిర్వేదంగా చూస్తూ- అనేవారు- 

'ఇన్ని గ్రంధాలు, ఎందుకు చదివానా,ఎందుకింత పరిశ్రమ మెదడుకు పెట్టానా 

వృధాగా అనిపిస్తుందీ! అనవసర శ్రమ!ప్రపంచంలో యెవడికీ పట్టని యీ 

జ్ఞానమంతా నేనొక్కడినీ యేమి చేసుకోను? అందరివలె యేదో కూడూ గుడ్డా 

కోసమే పాటు పడి ఉంటే ఆర్థికంగానైనా యేదొ కాస్త 

బాగుపడిఉండేవాణ్ణికదా? 

నా బుర్ర పజీతు (కడప ఉర్దు మాండలికం-గందరగోళం అనవచ్చు)

లేచిపోయిందిట్లా!! నా యీ పనికిమాలిన జ్ఞానం యీ రోజుల్లో యెవడికి

కావాలప్పా' అని!'' వారి మాటల్లోని వేదన, కళ్ళల్లో నీళ్ళు తెప్పించేది! 

అలాంటి మా అయ్య దగ్గరే కూర్చుని, యేవో పిచ్చి ప్రశ్నలు వేస్తూ

కూర్చున్నా, యెంత పరిజ్ఞానం అబ్బేదో, యీ వ్యావహారిక ప్రపంచ 

పరిజ్ఞానానికే, జీవనోపాధికే ప్రాధాన్యత ఇవ్వకుండా! అన్న పశ్చాత్తాపం

కలిగినా,పెళ్ళైన ఆడపిల్లగా పుట్టింట్లోనే ఉండటం వారికీ ఇష్టంలేదు కనుక 

మళ్ళీ బయలుదేరవలసే వచ్చేది నిస్సహాయంగా! 

  మా అయ్యగారి మాటల్లోని యీ  వేదనకు ఎంతో నేపథ్యం ఉంది మరి!!


  నా వివాహమై 34 సంవత్సరాలైంది. అయ్య పరిశ్రమ కళ్ళారా చూసిన

 గుర్తులిప్పటికీ మనస్సులో గూడు కట్టుకునే ఉన్నాయి. వారి గదిలోని

 గ్రంధలన్నిటికీ, నంబర్లు వేసి, వాటి ప్రక్రియల ప్రకారం సర్ది పెట్టటం ఎంతో 

ఇష్టంగా చేసే పని నా చిన్న తనాన! వాటిని,  భాషా పరంగా విభజించటమూ 

వుండేది. ఒక ట్రంకు పెట్టె లో అయ్య స్వహస్తాలతో వ్రాసుకున్న నోటు

 పుస్తకాలు చాలా ఉండేవి.వాటిలో చాలా వరకూ, వారు, ఆయా గ్రంధలను

, తాను మళ్ళి తన దస్తూరీలో వ్రాసుకున్నవే కాక, వివిధ భాషల శబ్ద

 కోశాలూ ఉండేవి. అన్నీ నీలం, ఆకుపచ్చా, యెర్ర సిరాతో ప్రత్యేక శ్రద్ధతో

 వ్రాసుకున్నవి. అవన్నీ చూస్తుంటే,  అయ్య శ్రమలోని అంతరార్థం  వెనుక

 నాకు అంతు పట్టని మర్మమేదో ఉందనిపించేది. పది సార్లు చదవటం కంటే 

ఒక సారి వ్రాయటం వల్లే యెక్కువ ప్రయోజనం ఉంటుందనీ, అలా 

వ్రాసుకోవటం,  కేవలం పుస్తకంలోనే కాదు, బుర్రలోనూ వ్రాసుకున్నట్టే అని 

పెద్దలంటూనే ఉంటారు కదా మరి! యెన్నెన్ని గంటలు వారల వ్రాసుకుని 

ఉంటారో లెక్క వెస్తే యెంతో ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ! 

అయ్య కీర్తికాయులైనప్పుడు వారి కొన్ని వ్రాత పుస్తకలను నాతో అత్త 

వారింటికి తెచ్చుకున్నను. వాటిలో, అయ్య సంగీతాభ్యాసం  కోసం 

వ్రాసుకున్న వర్ణాలూ, కీర్తనలూ మొదలు, జతులూ, మృదంగ వరుసలూ 

ఉన్నాయి. ఇంకా, తమిళ రచనలూ (అర్థ తాత్పర్యలతో సహా) కన్నడ

సాహిత్యం, విజయ నగర రాజులూ, విద్యారణ్యులూ, అన్నమయ్యా, 

తిరుప్పావై, రాసపంచాధ్యాయి వివరణ,  ఇంకా చాలానే ఉన్నాయి. ఇలా 

కసిగా,వారి మాటల్లోనే మరీ  రాక్షసంగా,ఎంతో శ్రమించి 

తానుసంపాదించుకున్న


 జ్ఞానాన్ని  యెవరికి పంచి పెట్టాలి? అసలు ఆసక్తి యెవరికుంది? 

యెవరితోనైనా ముచ్చటించాలంటే ఆ విధమైన అభిరుచి


 యీ వేగ నాగరికత వ్యామోహం లో కొట్టుకుపోయే తరానికి అంత తీరికేదీ? 

యెప్పుదూ సినిమాలూ,

 టీ. వీ కార్యక్రమాలూ  (1980-90 నాటికే టీ.వీ.ప్రాధాన్యత పెర్రిగిపోతున్న

 రోజులవి)  

   అందుకే అలా నిరాశ ధ్వనించేది వారి మాటల్లో! 

   నేను, అయ్య గ్రంధాలు కొన్నిటిని పునర్ముద్రించి నా వంతు సేవ 

చేసుకున్నాను. ఇంకా ఆ వ్రాత ప్రతులను

 చూస్తుంటే వీటిని యధాతథంగా కనీసం, యీ బ్లాగ్ లోనైనా పెడితే, 

యెవరికైనా ఉపయోగపదుతాయి 

కదా అనిపిస్తోంది. ఆ పని త్వరగా చేయాలి.. వాటిని ఉపయోగించుకునే తరం

 ముందెప్పుడైనా   

వస్తుందన్న ఆశ ఉంది. ఆశే మనిషికి సగం ఆయుస్షు కదా మరి!!